close
Choose your channels

‘మన్ముథుడు-2’ పై ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో..: నాగ్

Wednesday, August 7, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘మన్ముథుడు-2’ పై ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో..: నాగ్

అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్‌సింగ్ నటీనటులుగా రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిన చిత్రం ‘మన్మథుడు 2’. ఈ సినిమాలో నాగార్జున వయసు మళ్లినా పెళ్లి కాని బ్రహ్మచారి పాత్రలో కనిపించనున్నాడు. ఆగస్ట్-09న మన్మథుడు అభిమానుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్, ట్రైలర్స్ మంచి టాక్ తెచ్చుకోగా.. సినిమా కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అక్కినేని నాగార్జున మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సినిమా కథ.. రాహుల్ డైరెక్షన్, రకుల్ నటనతో పాటు తదుపరి ప్రాజెక్ట్స్‌ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

సినిమా గురించి..!

"నేను చాలా సినిమాలు చేసినప్పటికీ, కొత్త కథలపై, మనసుకు దగ్గరైన కథలపై కాస్త ఎక్కువ ఇంట్రస్ట్ ఉంటుంది. అలాంటి కథే ‘మ‌న్మథుడు 2’. సినిమాలో ఎమోషన్ గుడ్ ఎంటర్ టైన్మెంట్ పుష్కలంగా ఉంటుంది. అయితే, స్క్రిప్ట్‌ చాల బాగున్నా సినిమా పై ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలని నేనూ ఆసక్తిగా ఉన్నాను. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ సినిమా తీసిన విధానం నన్ను చాలా బాగా ఆకట్టుకుంది. పైగా రాహుల్ కూడా నన్ను కొత్తగా చూపించాలని అనుకున్నాడు. ఖచ్చితంగా తను తీసిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. సినిమాలో రకుల్ పాత్ర చాలా బాగుంటుంది. అవంతిక పాత్రలో చాల బాగా నటించింది" అని అక్కినేని చెప్పుకొచ్చారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.