close
Choose your channels

వెలుగులోకి మరో స్వామిజి రాసలీలల బాగోతం

Thursday, October 26, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బెంగుళూరు లో ఉన్న ఓ మఠంలో స్వామిజీ రాసలీలల వీడియో ఒకటి గురువారం వెలుగులోకి వచ్చింది.

మద్దేవణపుర మఠంలోని బెడ్ రూంలో నటితో నంజేశ్వర స్వామిజీ అలియాస్‌ దయానంద్‌ స్వామీజీ రాసలీలలు జరుపుతున్న సమయంలో రహస్యంగా వీడియో తీసి విడుదల చేశారు. ఆ నటి వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

ఈ విషయం బయటకు రావడం తో ట్రస్ట్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, దయానంద అలియాస్ నంజేశ్వర స్వామీజీ వెంటనే మఠం ఖాళీ చేసి వెళ్లిపోవాలని భక్తులు ఆందోళనకు దిగారు.

ఇప్పటికే మఠానికి సంబంధించి భూముల అవకతవకల్లో ఈ స్వామిజి హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

బెంగళూరులోని హుణసమారణహళ్ళిలో ఉన్న మద్దేవణపుర మఠం 500 ఏళ్ళ చరిత్ర కలిగి ఉంది. పర్వతరాజ్‌ శివాచార్య స్వామి నుంచి వారసత్వంగా బాధ్యతలు తీసుకున్న తనయుడు నంజేశ్వర స్వామిజీగా ప్రస్తుతం మఠ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.