close
Choose your channels

Malli Pelli:'మళ్లీపెళ్లి' టీజర్ : సినిమానా, నరేశ్-పవిత్రా లోకేష్‌ల బయోపిక్కా.. జనాలకు ఏం చెప్పబోతున్నారు..?

Friday, April 21, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పవిత్రా లోకేష్- నరేష్‌ల రిలేషన్‌షిప్ వ్యవహారం టాలీవుడ్ , శాండిల్‌వుడ్‌లను ఈ ఏడాది ఓ కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే. నరేష్, పవిత్రా లోకేష్‌ను నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. వీటిని ఇద్దరిలో ఎవ్వరూ ఖండించలేదు. కానీ చివరికి అవే నిజమయ్యాయి. ఇద్దరూ పెళ్లి చేసుకోకుండా, కలిసేవుంటున్నారు. ఇదే సమయంలో నరేష్ మూడో భార్య రమ్య రఘపతి వీరిద్దరిని మైసూరులోని ఓ హోటల్ గదిలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడమే కాకుండా, చెప్పుతో కొట్టేందుకు సిద్ధమైంది. అప్పట్లో ఈ వ్యవహారం దుమారం రేపింది.

పెళ్లి వీడియో పెట్టి షాకిచ్చిన నరేష్- పవిత్రా లోకేష్‌:

అలాగే న్యూ ఇయర్‌ను పురస్కరించుకుని పెళ్లికి సంబంధించిన సస్పెన్స్‌కు తెరదించారు నరేశ్- పవిత్రా లోకేష్. తాము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ఓ వీడియో వదిలారు. సినిమా ప్రోమోకు ఏ మాత్రం తగ్గని విధంగా కట్ చేసిన ఆ వీడియోలో నరేశ్, పవిత్ర కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకోవడమే కాకుండా ఇద్దరూ లిప్ కిస్ ఇచ్చుకుని కలకలం రేపారు. 2023లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తమ జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభమవుతోందని... అంతా తమను ఆశీర్వదించాలని ఈ జంట ప్రేక్షకులను కోరింది. ఆ తర్వాత కొద్దిరోజులకు తమ పెళ్లి వీడియో అంటూ మరో షాకిచ్చారు నరేష్, పవిత్రా లోకేష్.

సినిమా కోసమే ఇదంతా :

వీరిద్దరి రిలేషన్ నిజమే అయినా.. తర్వాత వచ్చిన పెళ్లి వీడియోలు, వీరిద్దరి లిప్ లాక్ వీడియో ఓ సినిమా కోసమని తెలియడంతో ప్రేక్షకులు ముక్కున వేలేసుకున్నారు. ఎంఎస్ రాజు దర్శకత్వంలో నరేష్, పవిత్రా లోకేష్‌లు ‘‘మళ్లీ పెళ్లి ’’ అనే సినిమా చేస్తున్నారు. నరేష్ తల్లి దివంగత విజయనిర్మల స్థాపించిన విజయకృష్ణ మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు నరేష్. ఈ బ్యానర్ స్థాపించి 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ‘‘మళ్లీ పెళ్లి’ సినిమాను నిర్మిస్తున్నారు నరేష్.

తమ జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారా:

తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. దీనిని చూస్తే ఇది టీజర్‌లా కనిపించలేదు. నరేష్, పవిత్రల జీవితంలో జరిగిన సంఘటనలే మన కళ్లముందు కదులుతాయి. నరేష్, పవిత్రా లోకేష్‌లు నిజ జీవిత పాత్రలు చేస్తే.. నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి పాత్రలో వనితా విజయ్ కుమార్ కనిపించారు. ఆమె ప్రెస్ మీట్ పెట్టడాన్ని కూడా టీజర్‌లో చూడొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సినిమా కాదు.. నరేష్-పవిత్ర బయోపిక్‌ అన్నంతగా జనాల్లో విపరీతంగా చర్చ నడుస్తోంది. ఈ సినిమా ద్వారా తనపై వచ్చిన ఆరోపణలకు నరేష్ చెక్ పెడతారేమోనని అనిపిస్తుంది.

ఈ సినిమాలో జయప్రద, శరత్ బాబు, వనితా విజయ్ కుమార్, అనన్య నాగళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణమ్మ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా.. సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూరుస్తున్నారు. మే నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.