close
Choose your channels

షాకిచ్చిన ఛానెల్‌కు.. దిమ్మతిరిగేలా ‘నిశ్శబ్దం’ టీమ్ నోటీసులు

Thursday, October 8, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

షాకిచ్చిన ఛానెల్‌కు.. దిమ్మతిరిగేలా ‘నిశ్శబ్దం’ టీమ్ నోటీసులు

హైదరాబాద్‌కు చెందిన ఓ లోకల్ ఛానెల్ ‘నిశ్శబ్దం’ టీంకు షాకిస్తే.. వెంటనే రియాక్ట్ అయిన టీం.. ఛానల్‌కు దిమ్మ తిరిగేలా నోటీసులు పంపించింది. వెంటనే అమెజాన్ ప్రైమ్ కూడా రియాక్ట్ అయి ఆ ఛానెల్‌కు చుక్కలు చూపించింది. అసలు విషయం ఏంటంటే.. ఈనెల రెండవ తేదీన ‘నిశ్శబ్దం’ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాను అతి త్వరలో తమ ఛానెల్‌లో ప్రసారం చేయబోతున్నట్టు హైదరాబాద్‌కు చెందిన లోకల్ ఛానెల్ ఒకటి ప్రకటించింది.

‘నిశ్శబ్దం’ సినిమాను త్వరలో ప్రసారం చేయనున్నట్టు లోకల్ ఛానెల్ ప్రకటించిన విషయం ఆ సినిమా నిర్మాతల దృష్టికి సైతం వెళ్లింది. దీంతో ఆ ఛానెల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాదు నష్టపరిహారం కింద 1.1 కోట్ల రూపాయలు చెల్లించాలని వారికి లీగల్ నోటీస‌ులు కూడా పంపించారు. ఈ సినిమా హక్కులు దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్‌కు కూడా విషయం తెలియడంతో.. ఆ సంస్థ మరో రూ.30 లక్షలు నష్టపరిహారం కోరుతోందని సమాచారం. మొత్తానికి లోకల్ ఛానెల్‌కు అటు నిర్మాతలు.. ఇటు ప్రైమ్ కలిసి చుక్కలు చూపించారు.

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘నిశ్శబ్దం’ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించగా.. అంజలి, షాలినీ పాండే తదితరులు కీలక పాత్రలు పోషించారు. కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో ఓ ఛాలెంజింగ్ రోల్‌లో అనుష్క నటించింది. ఈ సినిమాను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు `నిశ్శబ్దం` టీమ్ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.