close
Choose your channels

ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతున్న 'ఓ మల్లి'

Saturday, February 6, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బి.రమ్యశ్రీ ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ఓ మల్లి`. ఆర్.ఎ.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై బి.ప్రశాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం మార్చి 4న గ్రాండ్ లెవల్ లో రిలీజ్ అవుతుంది.

ఈ సందర్భంగా....

నిర్మాత బి.ప్రశాంత్ మాట్లాడుతూ `ఓ గ్రామంలోని యువతి యదార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ సినిమా అవుట్ పుట్ బావుండాలని రెండు సంవత్సరాలు యూనిట్ సభ్యులందరం కష్టపడ్డాం. చివరకు ఓ మంచి చిత్రాన్ని తీశామన్న సంతృప్తి కలిగింది. సినిమాను గ్రాండ్ లెవల్ మార్చి 4న విడుదల చేస్తున్నాం. సందేశాత్మక కథతో తెరకెక్కిన చిత్రమిదని, రమ్యశ్రీ అద్భుతంగా నటించడమే కాదు సినిమాను అద్భుతంగా తెరకెక్కాంచారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కె.దత్తుగారి సినిమాటోగ్రఫీతో చాలా నేచురల్ గా చూపించారు. ఆయన అందించిన సినిమాటోగ్రఫీ హైలైట్ అవుతుంది. డిపరెంట్ చిత్రమిది`` అన్నారు.

ఆకాష్, ఎల్.బి.శ్రీరామ్, శ్రీధర్, వేణు, సాయి, జయవాణి, బెనర్జీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: వి.నాగిరెడ్డి, కెమెరా: కె.దత్తు, సంగీతం: సునీల్‌కశ్యప్, నిర్మాత: బి.ప్రశాంత్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: బి.రమ్యశ్రీ.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.