close
Choose your channels

'బ్ర‌హ్మాండ‌నాయ‌గ‌న్‌'గా 'ఓం న‌మో వేంక‌టేశాయ'

Saturday, December 16, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అన్న‌మ‌య్య‌, శ్రీ‌రామ‌దాసు, శిరిడి సాయి వంటి భ‌క్తిర‌స చిత్రాల త‌రువాత అక్కినేని నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన మ‌రో ఆధ్యాత్మిక చిత్రం'ఓం నమో వేంకటేశాయ'. హాథిరాం భావాజీ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. హాథిరాం భావాజీ పాత్రలో నాగార్జున నటించారు. కృష్ణమ్మగా అనుష్క నటించారు. ప్రగ్యా జైస్వాల్, సౌరభ్ రాయ్ జైన్, జగపతి బాబు ఇత‌ర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి స్వ‌రవాణి కీరవాణి స్వరాలను అందించారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితం రాబట్టలేక పోయింది. అయితే పాట‌ల ప‌రంగా ఈ సినిమా మెప్పించింది. కాగా, తాజాగా ఈ సినిమాని తమిళంలో 'బ్రహ్మాండనాయగన్' పేరుతో డబ్ చేసారు. ఇప్పటికే విడుద‌లైన‌ ఈ సినిమా పాటలు తమిళ శ్రోతలను అలరిస్తున్నాయి. ఈ నెల 29న అక్క‌డ ఈ సినిమా విడుద‌ల కాబోతోంది. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన తెలుగు వెర్ష‌న్‌.. ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. మరి తమిళ ప్రేక్షకులను ఈ చిత్రం ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.