close
Choose your channels

రామోజీ ఫిలింసిటీలో ఓం న‌మో వేంక‌టేశాయ‌..!

Wednesday, October 26, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున - ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో రూపొందుతున్న అధ్యాత్మిక చిత్రం ఓం న‌మోవేంక‌టేశాయ‌. ఈ చిత్రాన్ని సాయికృపా ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై మ‌హేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అందాల తార‌లు అనుష్క‌, ప్ర‌గ్యా జైస్వాల్, విమ‌లారామ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇటీవ‌ల ఈ చిత్రం మ‌హాబ‌లేశ్వ‌రంలో షూటింగ్ జ‌రుపుకుంది.

ఇక తాజా షెడ్యూల్ ను గురువారం నుంచి రామోజీ ఫిలింసిటీలో ప్లాన్ చేసారు. ఈ షెడ్యూల్ లో నాగార్జున పై కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నారు. ఈ భ‌క్తిర‌స చిత్రానికి స్వ‌ర‌వాణి కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఈ అధ్యాత్మిక చిత్రాన్ని జ‌న‌వ‌రిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అన్న‌మ‌య్య‌, శ్రీరామ‌దాసు, శిరిడి సాయి చిత్రాల వ‌లే ఓం న‌మో వేంక‌టేశాయ చిత్రం కూడా అంద‌ర్నీ ఆకట్టుకుని అధ్యాత్మిక అద్భుత చిత్రంగా నిలుస్తుంద‌ని ఆశిద్దాం..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.