close
Choose your channels

Pawan Kalyan:పవన్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆగిపోయిన 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్..!

Thursday, November 16, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పవర్ స్టార్ అభిమానులకు కొంత బ్యాడ్ న్యూస్ లాంటి వార్త ఇది. ఇటు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పవన్ బిజీగా ఉన్నారు. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు చిత్రాల షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే అటు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమయం కావడంతో రాజకీయాలపై ఎక్కువ ఫోకస్ చేయాల్సి అవసం ఏర్పడింది. దీంతో ముందుగా 'ఉస్తాద్ భగత్ సింగ్', 'ఓజి' సినిమాలు పూర్తిచేయాలని కొన్ని రోజులు కేటాయించి షూటింగ్ మొదలెట్టారు. ఈ క్రమంలో 'ఓజి' షూటింగ్‌లో పవన్ పార్ట్ పూర్తైనట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ కావడంతో పూర్తిగా రాజకీయాలకే తన సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారని సమాచారం. దీంతో దర్శకుడు హరీష్ శంకర్‌ని పిలిచి వేరే సినిమా చేసుకోమని చెప్పినట్లు ఫిల్మ్‌నగర్ టాక్. ఏపీలో ఎన్నికలు పూర్తి అయ్యాక షూటింగ్ చేద్దామని చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కారణంతో ఇప్పటికే హరీశ్.. మాస్ మహారాజా రవితేజతో తన తదుపరి సినిమా స్టార్ట్ చేసినట్లు టాక్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల 20 నుంచి ప్రారంభంకానుందని.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దీనిని నిర్మిస్తుందని భోగట్టా.

ఇక సుజిత్ దర్శకత్వం వహిస్తున్న'ఓజి'లో మాత్రం పవన్ పాత్ర షూటింగ్ కంప్లీట్ కావడంతో ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతోంది. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో రానున్న 'హరిహర వీరమల్లు' షూటింగ్ కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన 80శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. మొత్తానికి వచ్చే ఏడాదిలో జరగనున్న ఏపీ ఎన్నికల తర్వాత పవన్ సినిమాలు వరుసగా విడుదల కానున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos