'పిశాచి-2' పాటల విడుదల
Tuesday, March 7, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
స్వర్ణ భారతి క్రియేషన్స్ పతాకంపై లయన్ సాయి వెంకట్ నిర్మిస్తున్న చిత్రం "పిశాచి-2". "డేంజర్ జోన్" అన్నది ట్యాగ్ లైన్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 17న విడుదల కానున్న ఈ చిత్రం ఆడియోను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు. భీమవరం మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం పాటలు మార్కెట్ లో లభ్యం కానున్నాయి.
ఈ కార్యక్రమంలో.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు నూతన అధ్యక్షునిగా ఎన్నికైన శివాజీ రాజా, బి.జె.పి ఎం.ఎల్.సి ఎన్.రామచంద్రరావు, మాజీ శాసన సభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి, ప్రముఖ నటి రమ్యశ్రీ, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
లయన్ సాయి వెంకట్ నిర్మిస్తున్న "పిశాచి-2" పాటలు తన చేతుల మీదుగా విడుదల కావడం సంతోషంగా ఉందని, ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని దత్తాత్రేయ ఆకాంక్షించారు. "పిశాచి-2" చిత్రానికి మంచి బిజినెస్ జరిగిందని, ఈనెల 17న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని సాయి వెంకట్ తెలిపారు. మిగతా అతిధులు సినిమా విజయం సాధించాలని అభిలషించారు.
ఆర్.జె.రూపేష్ శెట్టి-రమ్య జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి.. కెమెరా: వీనస్ మూర్తి, సంగీతం: సతీష్ ఆర్యన్, నిర్మాత: లయన్ సాయి వెంకట్, దర్శకత్వం: దేవరాజ్ కుమార్ !!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.