రూటు మార్చేసిన మారుతీ.. ప్రతీ రోజూ ప్రేక్షకులకు పండగే!
Send us your feedback to audioarticles@vaarta.com
సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. మారుతి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్ర ట్రైలర్ను తాజాగా విడుదల చేశారు. 2:18 నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ను చూస్తే.. సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ‘మారే కాలంతో పాటు మనం కూడా మారాలి. వయసుతో పాటు ఆశలు కూడా చచ్చిపోవాలి’ అనే డైలాగ్తో ఓ తాతయ్యలోని మనోవేదన అద్దం పట్టిందని చెప్పుకోవచ్చు.
ట్రైలర్లో ఏముంది..!?
ఒక ఊరు.. ఓ పెద్దాయన.. అమెరికాలో ఇద్దరు కొడుకులు.. ఈయనకేమో క్యాన్సర్.. ఐదువారాల కంటే ఎక్కువ బతకలేడు. ఈలోపు కొడుకులను చూడాలన్నది ఆయన కోరిక.. వాళ్లు ఊరికి రారు.. వచ్చినా ఎక్కువ రోజులు ఇక్కడ ఉండలేరు. అయితే ఆ పెద్దాయన చనిపోక ముందే కొడుకులిద్దరూ కర్మకాండలు ఎవరు చేయాలి? అనే దానిపై తర్జన భుర్జన ఒకింత గొడవపడుతుంటారు. అప్పుడు మనవడు ఊడిపడతాడు.. ఆయనే సాయిధరమ్ తేజ్.. అలా తాతయ్యకు భరోసా ఇస్తూ అన్ని కోరికలు తీరుస్తుంటాడు. ఆ తర్వాత ఇవన్నీ చూసిన కొడుకులు దిగొస్తారు. ఇదీ ట్రైలర్లో ఉంది.
రూటు మార్చేసిన మారుతీ..!
వాస్తవానికి మారుతి అంటేనే కామెడీ సినిమాలకు పెట్టిన పేరు. కాస్త కూస్తో ఎమోషన్ ఉన్నప్పటికీ దాదాపు అంతా కామెడీగానే సాగిపోతుంది. అయితే ఇప్పుడు మాత్రం కాస్త సీరియస్గా.. ఎమోషన్ టచ్ ఉండే సినిమాను తెరకెక్కించాడు. తాతా మనవళ్లపై ఎమోషనల్ను ట్రైలర్లో చూస్తే.. మారుతీ రూటు మార్చేశాడని స్పష్టంగా అర్థమవుతోంది. మరోవైపు..టిక్ టాక్లు చేసుకుంటూ, సెలబ్రెటీ అయిపోవాలని కలలు కనే అమ్మాయిగా రాశీఖన్నాను చూపించాడు. పల్లెటూరి అందాల మధ్య భారీ తారాగణం మధ్య తెరంతా నిండుగా కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే సకుటుంబ సమేతంగా వెళ్లి సినిమా చూసే విధంగా తెరకెక్కించాడని చెప్పుకోవచ్చు. అయితే సినిమా రిలీజ్ అయితే ప్రేక్షకులు ప్రతిరోజూ పండగ చేసుకుంటారా..? లేదా అనేది తెలుస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.