close
Choose your channels

శిల్పా బాధితుల్లో మహేశ్ బాబు చెల్లెలు... పోలీసులకు ఫిర్యాదు, ఉలిక్కిపడ్డ టాలీవుడ్

Thursday, December 2, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శిల్పా బాధితుల్లో మహేశ్ బాబు చెల్లెలు... పోలీసులకు ఫిర్యాదు, ఉలిక్కిపడ్డ టాలీవుడ్

కిట్టి పార్టీల పేరుతో సినీ, రాజకీయ ప్రముఖులను పరిచయం చేసుకుని వారి నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన శిల్పాచౌదరి బాగోతంతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఈ క్రమంలో శిల్ప.. దాదాపు రూ.200 కోట్ల దాకా కుచ్చు టోపీ పెట్టినట్లుగా పోలీసులు చెబుతున్నారు.హై ప్రొఫైల్ వ్యక్తులు బాధితులుగా వుండటంతో అత్యున్నత స్థాయిలో దర్యాప్తు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే రోజులు గడిచేకొద్ది శిల్పా చౌదరి బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో సూపర్‌స్టార్ మహేశ్ బాబు సోదరి, హీరో సుధీర్ బాబు సతీమణి ప్రియదర్శిని కూడా చేరారు.

శిల్పా బాధితుల్లో మహేశ్ బాబు చెల్లెలు... పోలీసులకు ఫిర్యాదు, ఉలిక్కిపడ్డ టాలీవుడ్

శిల్పా చౌదరి తనకు రూ.2.9 కోట్లు ఎగ్గొట్టారంటూ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ప్రియదర్శిణి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓ కిట్టి పార్టీలో శిల్ప తనకు పరిచయమైందని ఆమె వెల్లడించారు. డబ్బు కోసమే ఆమె ప్రతి వీకెండ్‌లో కిట్టి పార్టీ ఏర్పాటు చేసేదని ప్రియదర్శిని చెప్పారు. దీంతో టాలీవుడ్ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. శిల్ప వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పుడే పలువురు టాప్ సినీ సెలబ్రెటీలు ఆమె వలలో చిక్కుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వారి గురించి పోలీసులు బయటకు చెప్పలేదు. ఇప్పుడు ఏకంగా మహేశ్ చెల్లెలు తనకు తానుగా తెరపైకి రావడంతో ..ఇంకెంత మంది రాబోయే రోజుల్లో వెలుగులోకి వస్తారోనన్న ఉత్కంఠ మొదలైంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.