మీటూ గురించి ప్రియమణి స్పందన
Send us your feedback to audioarticles@vaarta.com
దక్షిణాది సినిమాల్లో నటించి హీరోయిన్గా తనకంటూఓ ప్రత్యేకతను సంపాదించుకున్న హీరోయిన్ ప్రియమణి. ఇటీవల పెళ్లి చేసుకున్న ఈమె ప్రస్తుతం వెబ్ సిరీస్, టీవీ షోసలకే పరిమితం అయ్యారు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలపై ప్రస్తావించారు. అందులో ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్గా పేరు తెచ్చుకున్న నయనతార, అనుష్క, సమంత రెమ్యునరేషన్లపై మాట్లాడారు. అలాగే మీ టూ ఉద్యమం గురించి కూడా మాట్లాడారు.
``ఒకప్పుడు హీరోయిన్స్ సినిమాలు పెద్ద హిట్ అయినా వారికి సరైన పారితోషకాలు దక్కేవి కావు. కానీ ప్రస్తుతం పరిస్థితులు అలా లేవు. నటీమణులు వారి పారితోషం తెలుసుకుని మరీ సినిమాలు చేస్తున్నారు. అందుకు ఉదాహరణలుగా నయనతార, అనుష్క, సుమంత గురించి చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా మహిళలు తమ స్థాయిని తెలుసుకుని మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది`` అన్నారు ప్రియమణి. అలాగే మీ టూ ఉద్యమం గురించి మాట్లాడుతూ ``మీటూ సమస్య చిత్ర రంగానికి సంబంధించినదే కాదు. ప్రతి రంగంలోనూ ఉంది. తమ జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి మహిళలు ముందుకొచ్చి మాట్లాడటం మంచిదే. అయితే మీ టూ ఘటనలు వినేటప్పుడు గుడ్డిగా నమ్మవద్దు. ప్రజలు ఈ విషయంపై సున్నితంగా వ్యవహరించాలి. మీ టూ ప్రభావం చాలా శక్తివంతంగా మారింది. ఇప్పుడు వేధించాలంటే ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.