close
Choose your channels

'పైసా వసూల్ ' తర్వాత పూరి సినిమా అదే!

Thursday, June 29, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విభిన్న కథలకు, విభిన్న చిత్రాలకు పూరి జగన్నాథ్‌ పెట్టింది పేరు. అతని సినిమాల్లో హీరోల పాత్ర చిత్రణ విచిత్రంగా వుంటుంది. హీరో బాడీ లాంగ్వేజ్‌, అతను చెప్పే డైలాగ్స్‌ ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా వుంటాయి. అప్పటివరకు ఎలాంటి ఇమేజ్‌ వున్నా పూరి సినిమా చేసిన తర్వాత ఆ హీరో ఇమేజ్‌లో మార్పు వస్తుంది. ప్రతి హీరో పూరితో సినిమా చెయ్యాలని అనుకుంటారు. చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ను పూరి దర్శకత్వంలో వచ్చిన 'చిరుత' చిత్రంతో హీరోగా పరిచయం చేశారంటే హీరోల్లో పూరికి ఫాలోయింగ్‌ ఏమిటి అనేది అర్థమవుతుంది. తన తమ్ముడు సాయిరామ్‌ శంకర్‌ను '143' చిత్రంతో హీరోగా పరిచయం చేశాడు.

కన్నడ హీరో ఇషాన్‌ను 'రోగ్‌' చిత్రంతో హీరోని చేశాడు. ఇప్పుడు పూరి తనయుడు ఆకాష్‌ వంతు వచ్చింది. అంతకుముందు 'ఆంధ్రాపోరి' అనే సినిమాలో హీరోగా నటించాడు ఆకాష్‌. ఇప్పుడు ఆకాష్‌ను పూర్తి స్థాయి హీరోగా పరిచయం చెయ్యాలని డిసైడ్‌ అయ్యాడు పూరి. అతని కోసం ఒక అద్భుతమైన సబ్జెక్ట్‌ని రెడీ చేశాడు. నటనతోపాటు ఇతర అంశాల్లో కూడా శిక్షణ తీసుకంటున్నాడు ఆకాష్‌. థాయ్‌లాండ్‌లో 45 రోజులు మువైథాయి అనే స్పోర్ట్స్‌ కోర్సును చేశాడు. వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక ఆహార నియమాలతో 8 కిలోల బరువు తగ్గించుకోగలిగాడు. ప్రస్తుతం నటనకు సంబంధించి న్యూయార్క్‌లో శిక్షణ పొందుతున్నాడు ఆకాష్‌. నందమూరి బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్‌ చేస్తున్న 'పైసా వసూల్‌' తర్వాత ఆకాష్‌తో చేసే సినిమా ప్రారంభమవుతుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.