కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రామ్ చరణ్ భార్య ఉపాసన
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా వ్యాక్సిన్ కోసం కళ్లలు కాయలు కాసేలా ఎదురు చూసిన ప్రజానీకం.. తీరా వచ్చాక మాత్రం వ్యాక్సినేషన్ కేంద్రాల వైపు కూడా చూడటం లేదు. వ్యాక్సిన్ వికటిస్తోందంటూ వదంతులు రావడంతో ప్రజలు భయపడి పోతున్నారు. ప్రభుత్వంతో పాటు అధికారులు ఎంతగా వ్యాక్సినేషన్ ఆవశ్యకాన్ని చెబుతున్నా జనానికి అది చెవికెక్కడం లేదు. ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్లపై నెలకొన్న అపోహలను తొలగించేందుకు మెగా పవర్ స్టార్ భార్య, అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్ ఉపాసన కొణిదెల ముందుకొచ్చారు.
నేడు ఉపాసన కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్పై ఉన్న అపోహలు, భయాలు తొలగించేందుకే తాను అపోలో సిబ్బందితో కలిసి కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్టు ఆమె వెల్లడించారు. ప్రజలు కరోనా వ్యాక్సిన్పై ఎలాంటి సందేహాలు, భయాలు పెట్టుకోవద్దని ఉపాసన సూచించారు. ఇప్పటికే అపోల్ హాస్పిటల్ వ్యవస్థాపకులు, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత ప్రతాప్ రెడ్డి కరోనా వ్యాక్సిన్ తీసుకోగా.. తాజాగా ఆయన మనవరాలు ఉపాసన సైతం ఈ వ్యాక్సిన్ తీసుకుని అది సురక్షితమని చాటే ప్రయత్నం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments