close
Choose your channels

మూడు విభిన్న పాత్రల్లో రవితేజ

Tuesday, January 30, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నీకోసం`, వెంకీ`, దుబాయ్‌ శీను` వంటి విజయవంతమైన చిత్రాల త‌రువాత‌ మాస్ మహారాజా రవితేజ, ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల కాంబినేష‌న్‌లో నాలుగో చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. న‌టుడిగా ర‌వితేజ‌కి ఇది 70వ చిత్రం కావ‌డం విశేషం. ఇదిలా ఉంటే.. త‌మ కాంబినేష‌న్‌లోని నాల్గ‌వ సినిమాని పూర్తిగా అమెరికా నేపథ్యంతో శ్రీనువైట్ల తెరకెక్కించ‌బోతున్నార‌ని ఇన్‌సైడ్ సోర్స్ చెప్పుకొస్తోంది. ఇప్పటికే కథకి తుది మెరుగులు దిద్దిన శ్రీనువైట్ల.. ప్ర‌స్తుతం అమెరికా లొకేషన్లను ఖరారు చేసే పనిలో పడ్డార‌ని స‌మాచార‌మ్‌.

అలాగే ఈ చిత్రంలో రవితేజ మూడు పాత్రల్లో కనిపించనున్నారని... అంతేగాకుండా అమర్ అక్బర్ అంటోనీ` పేరుని ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్‌లో కథనాలు వినిపిస్తున్నాయి. ర‌వితేజ పోషించే మూడు పాత్ర‌ల‌కి త‌గ్గట్టు ఇందులో ముగ్గురు కథానాయికలకి స్థాన‌ముంటుంద‌ని తెలిసింది. ప్ర‌స్తుతం వారి ఎంపిక జ‌రుగుతోంద‌ని స‌మాచార‌మ్‌. ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభించుకోనున్న‌ ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అటు ర‌వితేజ‌కి, ఇటు శ్రీ‌నువైట్ల‌కి క‌లిసొచ్చిన యువ సంగీత ద‌ర్శ‌కుడు తమన్.. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో తొలిసారిగా ప‌నిచేయ‌బోతున్నాడు. గ‌త‌ కొంత‌కాలంగా స‌రైన విజ‌యం లేని శ్రీ‌నువైట్ల ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నేలటికెట్` మూవీలో రవితేజ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని జూన్ నెలలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఫిబ్రవరి 2న టచ్ చేసి చూడు` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు మాస్ మహారాజా.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.