close
Choose your channels

మరో మల్టీస్టారర్‌కు రెడీ!

Saturday, January 5, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మరో మల్టీస్టారర్‌కు రెడీ!

జయాపజయాలతో సంబంధం లేకుండా మణిరత్నం రూపొందించే సినిమాలకు ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ఆయన సినిమా చేస్తున్నారంటే అది ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూసే అభిమానులు కూడా ఆయనకు ఎక్కువే. ఆయన దర్శకత్వంలో ఎన్నో దృశ్యకావ్యాలు తెరకెక్కాయి. ఈమధ్యకాలంలో ఆయన చేసిన కొన్ని సినిమాలు ప్రేక్షకుల్ని నిరాశ పరిచాయి. అయితే ఆమధ్య వచ్చిన ‘నవాబ్’తో మరోసారి తన మార్క్‌ను చాటుకున్నారు మణిరత్నం. ఇప్పుడు మరో మల్టీస్టారర్‌ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు.

ఇంతకు ముందే చేయాలనుకున్న ‘ఒన్నియిన్ సెల్వన్’ చిత్రాన్ని ఇప్పుడు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇంతకుముందు విజయ్, మహేశ్‌బాబు, ఐశ్వర్యరాయ్‌లాంటి స్టార్స్‌తో ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేశారు. అయితే అప్పుడు బడ్జెట్ కారణాల వల్ల డ్రాప్ అయ్యింది. అదే కథతో ఇప్పుడు విక్రమ్, శింబు, జయంరవి హీరోలుగా సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇక ఇందులో ప్రత్యేకం ఏమిటంటే బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్‌ను, ఆయన కోడలు, అందాలరాశి ఐశ్వర్యరాయ్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఇప్పటికే మణిరత్నం అమితాబ్‌ను కలిసి కథ వినిపించినట్లు తెలిసింది. ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.