close
Choose your channels

బైడెన్, ఫౌచీ వస్తున్నారు.. ఆనందయ్యపై ఆర్జీవీ సెటైర్లు

Saturday, May 22, 2021 • తెలుగు Comments
RGV
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బైడెన్, ఫౌచీ వస్తున్నారు.. ఆనందయ్యపై ఆర్జీవీ సెటైర్లు

నెల్లూరు జిల్లా కృష్ణ పట్నంలో కరోనా రోగులకు ఆనందయ్య అనే నాటు వైద్యుడు చేస్తున్న వైద్యం దేశం మొత్తం సంచలనంగా మారింది. ఆనందయ్య ఇచ్చిన మందు వాడక తాము కరోనా నుంచి త్వరగా కోలుకున్నామని చాలా మంది పాజిటివ్ గా చెబుతుండడంతో డిమాండ్ పెరిగింది.

ఆనందయ్య ఇస్తున్న మందుపై అధ్యయనం చేయడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, ఐసిఎంఆర్ రంగంలోకి దిగాయి. యావత్ ప్రపంచానికే పెను సవాల్ గా మారిన కరోనాని ఆనందయ్య ఇలా చిటికెలో తగ్గించేస్తున్నాడని వార్తలు రావడంతో అంతటా ఉత్కంఠ నెలకొంది.

ఇదీ చదవండి:  నీ కన్నా ఏజ్ ఎక్కువున్న నటితో డేటింగ్ ?.. హీరో ఆన్సర్ విన్నారా!

ఇదిలా ఉండగా ఎక్కడ ఏం జరిగినా నేనున్నాను అంటూ ట్విట్టర్ లో సెటైర్స్ తో ప్రత్యక్షమైపోతాడు వివాదాల రాంగోపాల్ వర్మ. తాజాగా వర్మ ఆనందయ్య పై సెటైర్లతో పలు ట్వీట్స్ చేశాడు.

'ఊపిరితిత్తులకు, కంట్లో పసరు వేయడానికి సంబంధం ఏంటి ఆనందయ్య.. జస్ట్ ఆస్కింగ్. ఇప్పుడు ప్రభుత్వం భారత్ బయోటెక్, పూనావాలా లాంటి సంస్థలకు ఫండ్స్ నిలిపివేసి ఆనందయ్య నాటు వైద్యానికి ఇస్తుందా.. జస్ట్ అస్కింగ్. అమెరికా అధ్యక్షుడు బైడెన్, అంటువ్యాధుల శాస్త్రవేత్త ఫౌచీ ఎయిర్ ఫోర్స్ వన్ లో కృష్ణ పట్నం బయలుదేరారని విన్నా. ఆనందయ్యతో డీల్ కుదుర్చుకోవడానికి వస్తున్నారు. ఆనందయ్యని వారు కిడ్నాప్ చేయకుండా ప్రభుత్వం రక్షణ కల్పించాలి అంటూ వర్మ తనదైన శైలిలో సెటైర్లతో విరుచుకుపడ్డాడు. 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.