close
Choose your channels

Sharmila:సీఎం జగన్ మానసిక స్థితి గురించి భయం వేస్తోంది: షర్మిల

Saturday, May 4, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సీఎం జగన్ మానసిక స్థితి గురించి భయం వేస్తోంది: షర్మిల

సీఎం జగన్‌కు చంద్రబాబు పిచ్చి పట్టుకున్నట్టుందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. చంద్రబాబుతో ఈ వైఎస్సార్ బిడ్డ చేతులు కలిపినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు.

"జగన్ మానసిక స్థితి గురించి నాకు భయం వేస్తోంది. చంద్రబాబు చెబితే నేను కాంగ్రెస్ పార్టీలో చేరానని అంటున్నారు. మరి ఆనాడు చంద్రబాబు చెబితేనే జగన్ కోసం పాదయాత్ర చేశానా? సునీత కూడా చంద్రబాబుతో చేతులు కలిపారని అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు మాట వింటారని చెబుతున్నారు. చంద్రబాబు ఎంతో పవర్ ఫుల్ అని చెబుతున్నారు... ఏం జరిగినా చంద్రబాబే కారణమని అంటున్నారు. జగన్‌కు చంద్రబాబు పిచ్చి పట్టుకున్నట్టుంది. అందుకే అద్దం పంపిస్తున్నాను. ఈ అద్దంలో చూసుకుంటే జగన్‌కు చంద్రబాబు ముఖమే కనబడుతోందా?ఈ అద్దంలో జగన్ తనను తాను చూసుకోవాలి. అద్దంలో తానే కనిపిస్తున్నారో, చంద్రబాబు కనిపిస్తున్నారో చెప్పాలి" అన్నారు.

సీఎం జగన్ మానసిక స్థితి గురించి భయం వేస్తోంది: షర్మిల

అలాగే "రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు దాని వెనక రిలయన్స్ సంస్థ వారి హస్తం ఉందని జగన్ చెప్పారు. అది నిజమని నమ్మిన ఎంతో మంది వైఎస్సార్ అభిమానులు రిలయన్స్ సంస్థలపై దాడులు చేసి కేసుల్లో ఇరుక్కున్నారు. ఇప్పటికీ వారు ఆ కేసులతో ఇబ్బంది పడుతున్నారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక ఏ రిలయన్స్ సంస్థ అయితే వైఎస్సార్ హెలికాఫ్టర్ ప్రమాదం వెనక ఉందని చెప్పారో.. అదే రిలయన్స్ సంస్థకి చెందిన వ్యక్తికి రాజ్యసభ పదవి ఇచ్చారు. అంటే జగన్ మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పింది అబద్ధం అని తనంతట తానే రుజువు చేసుకున్నారు" అని విమర్శించారు.

ఇక సీబీఐ ఛార్జ్‌షీట్‌లో వైఎస్సార్ పేరు ప్రస్తావన గురించి చెబుతూ "కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా మరోసారి చెబుతున్నాను. రాజశేఖర్ రెడ్డి పేరుని కాంగ్రెస్ పార్టీ సీబీఐ ఛార్జిషీటులో చేర్చలేదు. పొన్నవోలు సుధాకర్ పట్టుబట్టి చేర్చారు. అయితే ఇప్పుడు నేను మాటలు మార్చినట్టుగా పొన్నవోలు నా పాత వీడియోలను వెతికి మరీ చూపిస్తున్నారు. నన్ను ఊసరవెల్లిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ రోజు నిజం తెలియక మేము అలా మాట్లాడాం. ఈ రోజు నిజం తెలిసింది కాబట్టి ఈ మాట మాట్లాడుతున్నాం. ఈ విషయాన్ని మీరు గమనించాలి. మొన్న సోనియా గాంధీ గారిని కలిస్తే ఆ విషయాన్ని ఆమె స్పష్టంగా చెప్పారు. నేను పెట్టలేదని అన్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఇదే చెప్పారు. పొన్నవోలు సుధాకర్ మూడు కోర్టులకు తిరిగి రాజశేఖర్ రెడ్డి గారి పేరు చేర్చించారని ఆయన చెప్పేదాకా నాకు తెలియదు’’ అని షర్మిల వెల్లడించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment