22 కోట్ల రూపాయల సన్నివేశం
Send us your feedback to audioarticles@vaarta.com
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాంచరణ్ నటిస్తోన్న దేశభక్తి చిత్రం `RRR`. మూడో షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. రెండు నిజమైన పాత్రలకు సంబంధించిన కల్పిత కథే ఈ చిత్రం. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్గా నటిస్తుంటే.. ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సన్నివేశాన్ని 22 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెరకెక్కించబోతున్నారట. అలాగే చరణ్ ఎంట్రీ సీన్ కూడా అదిరిపోయే రేంజ్లోనే తెరకెక్కనుందట. ఈ సినిమా కోసం రాజమౌళి టాప్ క్లాస్ టెక్నీషియన్స్ను ఎంచుకున్నారు. 400 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జూలై 30న విడుదల చేస్తున్నారు.
ఎన్టీఆర్, చరణ్లతో పాటు అజయ్ దేవగణ్, ఆలియా భట్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన నటించాల్సిన డైసీ ఎడ్గార్గ్ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ఆమె స్థానంలో మరో హీరోయిన్ను ఎంపిక చేసే పనిలో రాజమౌళి బిజీగా ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.