close
Choose your channels

సాయిధ‌ర‌మ్ తేజ్‌, ఎ.క‌రుణాక‌ర‌న్ చిత్రం టైటిల్ ఏంటంటే..

Monday, March 12, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగాహీరో సాయిధరమ్ తేజ్, కేర‌ళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ జంటగా ప్రేమ‌క‌థా చిత్రాల స్పెష‌లిస్ట్ ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య‌వంత‌మైన‌ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

మెగాస్టార్‌ చిరంజీవి కాంబినేష‌న్‌లో 'అభిలాష', 'ఛాలెంజ్', 'రాక్షసుడు' వంటి బ్లాక్ బస్టర్ హిట్లను అందించిన సంస్థగా క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ కు మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆయ‌న మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్‌తో తొలిసారిగా ఈ సినిమాని నిర్మిస్తుండ‌డం విశేషం. ఇదిలా ఉంటే.. కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైన‌ర్‌ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ చిత్రీకరణను పూర్తిచేసుకుంది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు 'దేవుడు వరమందిస్తే' అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించారని తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. గోపీ సుందర్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రం జూన్ 14న‌ విడుదల కానుంద‌ని సమాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.