close
Choose your channels

వ్యవస్థలపై పాశుపతాస్త్రం: ఆలోచింపజేస్తున్న సాయిధరమ్ తేజ్ ‘‘రిపబ్లిక్’’ ట్రైలర్

Wednesday, September 22, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వ్యవస్థలపై పాశుపతాస్త్రం: ఆలోచింపజేస్తున్న సాయిధరమ్ తేజ్ ‘‘రిపబ్లిక్’’ ట్రైలర్

మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రిపబ్లిక్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు అక్టోబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందుకు సంబంధించి బుధవారం మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా చిత్రయూనిట్ ట్రైలర్‌ని రిలీజ్ చేసింది. ఇందులో సాయి ధరమ్ తేజ్ కలెక్టర్‌గా ప్రజలలో చైతన్యాన్ని తీసుకువచ్చే నిజాయితీ గల అధికారిగా కనిపించనున్నారు.

వ్యవస్థలపై పాశుపతాస్త్రం: ఆలోచింపజేస్తున్న సాయిధరమ్ తేజ్ ‘‘రిపబ్లిక్’’ ట్రైలర్

ప్రభుత్వ వ్య‌వ‌స్థ‌లు ఎలా ప‌నిచేయాలి... ఎలా ప‌నిచేస్తే ప్ర‌జ‌ల‌కు ప్రయోజనం అనే విష‌యాల‌పై లోతుగా చ‌ర్చించిన‌ట్టు ట్రైల‌ర్‌లోనే తెలుస్తోంది. క‌లెక్ట‌ర్‌గా త‌న విధి నిర్వ‌హ‌ణ‌లో ఎదురయ్యే స‌మ‌స్య‌లు, రాజ‌కీయ శ‌క్తుల ఒత్తిడి ఇవే ఈ క‌థ‌కు మూలాలు. సీరియ‌స్‌గా సాగిన ట్రైల‌ర్‌లో.. త‌న ఎమోష‌న్ ఏమిటో చెప్పేశాడు దేవాక‌ట్టా. ముఖ్యంగా ఆయన తన పెన్ పవర్ మరోసారి చూపించాడు.

వ్యవస్థలపై పాశుపతాస్త్రం: ఆలోచింపజేస్తున్న సాయిధరమ్ తేజ్ ‘‘రిపబ్లిక్’’ ట్రైలర్

”స‌మాజంలో తిరిగే అర్హ‌తే లేని గుండాలు
ప‌ట్ట‌ప‌గ‌లే బాహాటంగా ప్ర‌జ‌ల ప్రాణాలు తీస్తుంటే
కంట్రోల్ చేయాల్సిన వ్య‌వ‌స్థ‌లే వాళ్ల‌కు కొమ్ము కాస్తున్నాయ్‌”

”మీ భ‌యం అజ్ఞానం అమాయ‌క‌త్వం విశ్వాస‌మే
ఆ సింహాస‌నానికి నాలుగు కాళ్లు”

”అజ్ఞానం గూడు క‌ట్టిన చోటే
మోసం గుడ్లు పెడుతుంది…”

వంటి పవర్‌ఫుల్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఈ చిత్రంలో రాజకీయ నాయకురాలిగా నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్, రమ్యకృష్ణ మధ్య సన్నివేశాలు ఉత్కంఠభరితంగా వుండనున్నాయి.

వ్యవస్థలపై పాశుపతాస్త్రం: ఆలోచింపజేస్తున్న సాయిధరమ్ తేజ్ ‘‘రిపబ్లిక్’’ ట్రైలర్

ఇకపోతే ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సాయితేజ్ ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే విషయమై చిరు స్పందిస్తూ… తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1 వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్ కి శ్రీరామ రక్ష..అంటూ పేర్కొన్నారు చిరు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.