సీనియర్ కొరియోగ్రాఫర్ శ్రీను మాస్టర్ కన్నుమూత
Send us your feedback to audioarticles@vaarta.com
కోలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ శ్రీను మాస్టర్(82) తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. ఆదివారం నాడు గుండెపోటుతో చెన్నైలోని ఆయన నివాసంలో కన్నుమూశారు. శ్రీను మాస్టర్ కర్నూల్ జిల్లా ఆదోనీకి చెందిన వ్యక్తి. ఈయన ప్రముఖ కొరియోగ్రాఫర్ హీరాలాల్ దగ్గర శిష్యరికం చేసి.. 1700 వందల చిత్రాలకు కొరియోగ్రఫీ చేశారు. ‘స్వర్ణ కమలం’, ‘రాధాగోపాళం’, ‘శ్రీరామరాజ్యం’ లాంటి చిత్రాలకు ఈయన బెస్ట్ కొరియోగ్రాఫర్గా నంది అవార్డు అందుకున్నారు.
ఇదిలా ఉంటే.. 1969లో నిర్మాత డూండి రూపొందించిన ‘నేనేంటే నేనే’ చిత్రంతో డ్యాన్స్ మాస్టర్గా శ్రీను ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు. అనంతరం మహా బలుడు, భక్త కన్నప్ప, దొరబాబు, ఎదురులేని మనిషి, యుగంధర్, యుగ పురుషుడు సహా మొత్తం 1700 చిత్రాలకు ఆయన పనిచేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.