close
Choose your channels

అమ‌లాపురంలో 'శ్రీ‌నివాస క‌ళ్యాణం'

Sunday, June 10, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అమ‌లాపురంలో శ్రీ‌నివాస క‌ళ్యాణం

నితిన్, రాశి ఖ‌న్నా, నందితా శ్వేతా హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం 'శ్రీ‌నివాస క‌ళ్యాణం'. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ‌త‌మానం భ‌వ‌తి ఫేమ్ స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ అమ‌లాపురంలో జ‌రుగుతోంది.

నితిన్‌, రాశి ఖ‌న్నా, నందితా శ్వేతా, ప్ర‌కాష్ రాజ్‌, జ‌య‌సుధ‌, న‌రేష్‌, ఆమ‌ని, గిరిబాబు త‌దిత‌రుల‌పై కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఫ్యామిలీ రిలేష‌న్స్‌, హ్యుమ‌న్ వాల్యూస్ అనే అంశాల చుట్టూ తిరిగే ఈ సినిమాని ఆగ‌స్టు 9న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

దిల్ త‌రువాత దాదాపు 15 ఏళ్ళ గ్యాప్‌తో నితిన్‌, దిల్ రాజు కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా ఇది. ఇందులో నితిన్ ఆర్కిటెక్ట్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాకి మిక్కీ జే.మేయ‌ర్ సంగీత‌మందిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.