తూచ్.. అవన్నీ పుకార్లే అంటున్న సుహాసిని!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ దర్శకుడు మణిరత్నం గుండెపోటుతో ఆసుపత్రిలో చేరినట్టు సోమవారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున వార్తలు హడావుడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను ఆయనకు దగ్గరి సన్నిహితులు, మిత్రులు పలువురు ఖండించినప్పటికీ.. కుటుంబ సభ్యులు ఎవరూ రియాక్ట్ అవ్వకపోవడంతో నిజమేనేమోనని సోషల్ మీడియా, వెబ్ మీడియాల్లో ఈ వార్త ప్రముఖంగా ప్రస్తావించబడింది. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ వ్యవహారంపై సుహాసిని కూడా రియాక్ట్ అవ్వకపోవడంతో ఆమెకు అభిమాన సంఘాల నుంచి, సినీ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ రావడంతో ఎట్టకేలకు ట్విట్టర్ వేదికగా ఆమె రియాక్ట్ అయ్యారు. దీంతో అభిమానుల్లో, సినీ ప్రియుల్లో నెలకొన్న ఆందోళనకు తెరదించినట్లైంది.
సుహాసిని స్పందన ఏంటి..!?
"నా భర్త ఉదయం 9:30 గంటలకు తనకిష్టమైన రోటీ, మామిడికాయ పచ్చడి తిని స్క్రిప్ట్ వర్క్ కోసం ఆఫీసుకు వెళ్లిపోయారు. నేను నామ్ వర్క్ షాపులో బిజిబిజీగా ఉన్నాను. ఆయన స్క్రిప్ట్ వర్క్లో బిజీగా ఉన్నారు. ఆయనకు మామిడికాయ పచ్చడి అంటే ఎంతో ఇష్టం.. ఆయన తిన్న పచ్చడి ఓ గృహిణి రూప వర్క్షాపులో భాగంగా మాకు ఇచ్చింది. థ్యాంక్యూ రూప. మణి ఈ పచ్చడి చాలా ఇష్టపడ్డాడు" అని ట్విట్టర్ వేదికగా ఆమె పోస్ట్ చేశారు. అంతేకాదు రూప అనే గృహిణి ఫొటోలు సైతం సుహాసిని తన ట్వీట్కు జతచేసింది.
అంటే అర్థం.. ఉదయం నుంచి వస్తున్న వార్తలకు సింగిల్ ట్వీట్తో అవన్నీ పుకార్లేనని చెప్పేశారన్న మాట. కాగా.. మణిరత్నం ప్రస్తుతం ‘పొన్నియన్ సెల్వన్’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆయన ప్రశాంతంగా తర్వాతి సినిమా పనులు చేసుకుంటున్నారని, రెగ్యులర్ హెల్త్ చెకప్ వలన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని సన్నిహితులు చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.