close
Choose your channels

జ‌గ‌న్‌తో ముగిసిన భేటీ.. చిరంజీవికి థ్యాంక్స్, త్వరలోనే గుడ్ న్యూస్ వింటారు: మ‌హేశ్ బాబు

Thursday, February 10, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సినీ పరిశ్రమ సమస్యలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ నిర్ణయం తమను ఎంతో సంతోష పరిచిందన్నారు. టికెట్‌ ధరలకు సంబంధించి శుభం కార్డు పడినట్లే తాము భావిస్తున్నామని చిరంజీవి ఆకాంక్షించారు. చిన్న సినిమాలు ఐదో షోకు అనుమతించడం శుభపరిణామమన్నారు.

సమస్యల పరిష్కారానికి సంబంధించి ఈనెలాఖరులోనే జీవో వస్తుందని భావిస్తున్నామని చిరంజీవి తెలిపారు. మంత్రి పేర్ని నాని చొరవతో ఈ సమస్యలకు శుభంకార్డు పడిందని మెగాస్టార్ చెప్పారు. హైదరాబాద్‌ తరహాలో విశాఖలోనూ సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు జగన్‌ చెప్పారని చిరు తెలిపారు. దానికి తమ వంతు సహకారం ఉంటుందని మెగాస్టార్ అన్నారు.

అనంతరం మ‌హేశ్ బాబు మాట్లాడుతూ.. తొలుత చిరంజీవికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోవాల‌న్నారు. మొద‌టి నుంచీ ఆయన చొర‌వ చూపి స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషి చేశార‌ని మహేశ్ ప్రశంసించారు. ఇటీవ‌ల సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎన్నో స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని.. త్వ‌ర‌లోనే ఓ గుడ్ న్యూస్ వింటార‌ని మహేశ్ చెప్పారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.