close
Choose your channels

‘సైరా’ ప్రీ రిలీజ్ వేదిక మారింది..!

Thursday, September 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘సైరా’ ప్రీ రిలీజ్ వేదిక మారింది..!

మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్.. కెరియర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తండ్రి కలను నెరవేర్చడంలో భాగంగా చిరు తనయుడు రామ్ చరణ్ ఈ బిగ్గెస్ట్ హిస్టారికల్ మూవీని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా షూటింగ్ మొదలుకుని ప్రొడక్షన్ వర్క్స్ అయిపోవడమే కాకుండా సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేసింది. ఇక థియేటర్లలోకి రావడమే ఆలస్యం. ఈ తరుణంలో సినిమా ప్రమోషన్స్‌ని పూర్తిస్థాయిలో చిత్రబృందం మొదలుపెట్టేసింది.

సినిమా ప్రమోషన్స్‌ అనేవి బ్లాక్ బ్లస్టర్ కావడానికి ఒక ప్రధాన సోర్స్ అన్న విషయం విదితమే. అందుకే సైరా ప్రమోషన్స్‌కు భారీగానే చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. మొదట.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కర్నూలు జిల్లా వేదికగా భారీగా దర్శకనిర్మాతలు ప్లాన్ చేశారట. ఇందుకు కారణం.. ఇది రాయలసీమ ప్రాంతానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడి కథ కావడం.. ఆయన కర్నూలు జిల్లా వాసే కావడంతో ఈ నెల 15న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలని భావించారట. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కర్నూలు వద్దనుకునుకున్నారట.

కర్నూలు కాదు.. గచ్చిబౌలి స్టేడియం ఫిక్స్!

వాతావరణం అనుకూలించకపోవడంతో కర్నూలు నుంచి వేదికను మార్చాలని ‘సైరా’ టీం ఫిక్స్ అయ్యిందట. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో వేడుక నిర్వహించాలని దర్శకనిర్మాతలు ఫైనల్‌గా నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సెప్టెంబర్ 18న ఈ వేడుక నిర్వహిస్తారని లీకులు వస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే చిత్రయూనిట్ స్పందించాల్సి ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.