close
Choose your channels

మాదకద్రవ్యాల కేసులో టాలీవుడ్ నటి అరెస్ట్..

Sunday, January 3, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మాదక ద్రవ్యాల కేసు.. టాలీవుడ్‌ను ఓ కుదుపు కుదిపేసి.. తరువాత బాలీవుడ్‌లోనూ ప్రకంపనలు సృష్టించి చివరకు తిరిగి టాలీవుడ్‌ మెడకూ చుట్టుకుని ఇటీవలి కాలంలో సైలెంట్ అయిపోయింది. తిరిగి తాజాగా మరోసారి టాలీవుడ్‌లో కలకలం రేపింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును సీబీఐ అధికారులు విచారణ నిర్వహిస్తుండగా.. డ్రగ్స్ కోణం వెలుగు చూసింది. దీంతో కేసును ఎన్సీబీకి అప్పగించారు. అప్పట్లో ఎన్సీబీ విచారణలో ఇద్దరు, ముగ్గురు టాలీవుడ్ ప్రముఖ నటుల పేర్లు సైతం వినిపించాయి.

ఈ మధ్య కొంత కాలంగా డ్రగ్స్‌కు సంబంధించిన అప్‌డేట్స్ అయితే ఏమీ లేవు. దీంతో మాదక ద్రవ్యాల సరఫరా పూర్తిగా ఆగిపోయిందని బాలీవుడ్, టాలీవుడ్ ఊపిరి తీసుకుంటున్న తరుణంలో సడెన్‌గా మరోమారు టాలీవుడ్ నటి డ్రగ్స్‌తో ముంబై మీరా రోడ్డులోని ప్రముఖ హోటల్‌లో డ్రగ్స్‌తో పట్టుబడటం సంచలనంగా మారింది. ఆదివారం ఎన్సీబీ అధికారులు సదరు హోటల్‌పై దాడి చేశారు. ఈ దాడిలో టాలీవుడ్ నటితో పాటు డ్రగ్ పెడ్లర్ చాంద్ మహ్మద్‌ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్సీబీ దాడిలో నాలుగు వందల గ్రాముల డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.