close
Choose your channels

ఉదయ్ కిరణ్ చివరి సినిమా ‘చిత్రం చెప్పిన కథ’ ఇన్నాళ్లకు ఓటీటీలో విడుదల

Wednesday, July 1, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్టార్ హీరో ఉదయ్ కిరణ్ చివరి సినిమా ఇన్నాళ్లకు విడుదలకు నోచుకుంది. ఉదయ్ మరణం ఎంతో మంది అభిమానులను కలచివేసింది. ‘చిత్రం’ సినిమాతో ప్రారంభమైన ఉదయ్ కిరణ్ కెరీర్.. కొంతకాలం పాటు అప్రతిహతంగా కొనసాగింది. ‘నువ్వు నేను.. మనసంతా నువ్వే’ తదితర చిత్రాలతో యూత్ మనసులో లవర్ బాయ్‌గా నిలిచిపోయాడు. అయితే ఉదయ్ కిరణ్ సినీ కెరీర్ ‘చిత్రం’తో మొదలైందని అందరికీ తెలిసిన విషయమే. కానీ ‘చిత్రం చెప్పిన కథ’తో ముగిసిందని చాలా కొద్ది మందికే తెలుసు.

ఉదయ్ చివరిగా చేసిన సినిమా ఇది. కానీ విడుదలకు మాత్రం నోచుకోలేదు. అయితే ఈ చిత్రంతో తన సినీ కెరీర్ మళ్లీ ఊపందుకుంటుందని ఉదయ్ చాలా ఆశతో ఉన్నట్టు తెలిసింది. దీనికి కారణం.. ఓ సందర్భంలో ఈ సినిమా తనకు ఓ మంచి హిట్ ఇస్తుందని ఉదయ్ చెప్పిన మాటలే. కారణాలేంటో కానీ రిలీజ్ కూడా నోచుకోలేదు. ఇన్నాళ్లకు ఈ చిత్రాన్ని రూ.3 కోట్లకు ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసి విడుదల చేసింది. ఉదయ్ కిరణ్ ఆఖరి చిత్రం కాబట్టి దీనికి ఆదరణ బాగానే ఉంటుందని భావిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.