close
Choose your channels

Kavitha:లిక్కర్ కేసులో ఊహించని పరిణామం.. కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు..

Saturday, March 23, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో వరుసగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసి ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజుతో ఆమె కస్టడీ పూర్తికావొస్తున్న తరుణంలో ఈడీ ఊహించని షాక్ ఇచ్చింది. తెల్లవారుజాము నుంచే హైదరాబాద్‌లోని కవిత బంధువుల ఇళ్లతో పాటు ఆమె భర్త అనిల్ కుమార్ బంధువుల ఇళ్లలోనూ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. మాదాపూర్‌లో ఉన్న కవిత ఆడపడుచు అఖిల ఇంట్లోనూ తనిఖీలు చేస్తున్నారు.

కస్టడీలో కవిత ఇచ్చిన సమాచారంతోనే అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కవిత భర్త అనిల్ కుమార్ బ్యాంకు లావాదేవీలను పరిశీలించగా ఆడపడుచు అఖిల విషయం బయటికొచ్చిందని అందుకే సోదాలు అని వినిపిస్తోంది. తనిఖీల్లో ఏం దొరికాయి..? ఏమైనా కొత్త అరెస్టులు ఉంటాయా..? అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాలి.

కాగా మార్చి 15న హైదరాబాద్‌లోని కవిత ఇంట్లో ముమ్ముర సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. కవిత నుంచి ఇప్పటికే సుమారు 16 మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమె భర్త అనిల్ కుమార్‌ను విచారణకు రావాలని కూడా నోటీసులిచ్చారు. అయితే ఆయన విచారణకు హారుకాలేదు.

ఇదిలా ఉంటే నేటితో కవిత కస్టడీ ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెను అధికారులు హాజరుర్చనున్నారు. మరో ఐదు రోజుల పాటు కస్టడీని పొడిగించాలని ఈడీ కోరనున్నట్లు తెలుస్తోంది. అయితే కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఆరు రోజుల పాటు కస్టడీకి ఇచ్చిన విషయం విధితమే. ఇప్పుడు కవిత కస్టడీ కూడా పొడిగిస్తే ఇద్దరిని కలిపి విచారించే అవకాశముంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.