'కంచె' కాంబినేషన్లో మరో సినిమా
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
వరుణ్ తేజ్, క్రిష్ కాంబినేషన్లో రూపొందిన కంచె విమర్శకుల ప్రశంసలందుకుని విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన మా అమ్మ మహాలక్ష్మి రిలీజ్ కి రెడీ అవుతుంది. సి.కళ్యాణ్ నిర్మించిన ఈ మూవీని డిసెంబర్ 18న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే..వరుణ్ తేజ్...మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నటించేందకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే కంచె తో కమర్షియల్ సక్సెస్ అందించిన డైరెక్టర్ క్రిష్ తో కలసి మరో సినిమా చేయనున్నారని సమాచారం. ఈ సినిమా వచ్చే సంవత్సరం ప్రధమార్ధంలో ప్రారంభించనున్నారు. మరి..ఈసారి వరుణ్ తేజ్ తో చేసే సినిమాకి క్రిష్ ఎలాంటి కథను ఎంచుకుంటాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.