విజయనిర్మల మరణం సినీ పరిశ్రమకు తీవ్రలోటు : వైఎస్ జగన్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ సీనియర్ నటి, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ బుక్ రికార్డు సాధించిన మేటి దర్శకురాలైన విజయనిర్మల మరణం చిత్రపరిశ్రమకు తీవ్రలోటు అని వైఎస్ జగన్ మోహన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబానికి జగన్.. ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
సీనియర్ నటి విజయనిర్మల(73) తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులు అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో బుధవారం అర్ధరాత్రి దాటాక కన్నుమూశారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాడ సంతాపం తెలిపి.. విజయ నిర్మల కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.