close
Choose your channels

సుశాంత్ రాజ్‌పుత్ మరణాన్ని జీర్ణించుకోలేక విశాఖ యువతి ఆత్మహత్య

Friday, June 19, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సుశాంత్ రాజ్‌పుత్ మరణాన్ని జీర్ణించుకోలేక విశాఖ యువతి ఆత్మహత్య

బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్‌పుత్‌కి ఒక్క బాలీవుడ్‌లోనే కాకుండా ఇతర భాషల్లోనూ అభిమానులున్నారు. ఇటీవల సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంతో అభిమానులంతా షాక్‌కి గురయ్యారు. తాజాగా సుశాంత్ మరణాన్ని జీర్ణించుకోలేక విశాఖకు చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. విశాఖలోని శ్రీహరిపురానికి చెందిన సదరు యువతి ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తోంది. సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడిన నాటి నుంచి అతని వీడియోలు టిక్‌టాక్‌లో చూస్తూ మనస్తాపానికి గురైంది. దీంతో ఆత్మహత్యకు పాల్పడింది. మొదట దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె మొబైల్‌ను పరిశీలించిన తరువాత సుశాంత్ మరణమే ఆమె ఆత్మహత్యకు కారణంగా తేల్చారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.