close
Choose your channels

కథ విన్నఅరవింద్ ఏం చెప్పారంటే...?

Saturday, December 30, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అల్లు శిరీష్, సురభి, అవసరా శ్రీనివాస్, శీరత్ కపూర్ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ఒక్క క్షణం`. వి.ఐ.ఆనంద్ దర్శకుడు. చక్రి చిగురుపాటి నిర్మాత. సినిమా డిసెంబర్ 28న విడుదలైంది. ఈ సందర్భంగా హీరో అల్లు శిరీష్‌తో మీడియాతో మాట్లాడుతూ ఒక్కక్షణం` సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆనంద్ 40 నిమిషాలు కథ చెప్పిన విధానం నాకు నచ్చడంతో వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. అలాగే అందులో ఆయన చెప్పిన ప్యారలల్ లైఫ్ అనే పాయింట్ నన్ను చాలా రోజుల హాంట్ చేసింది.

సాధారణంగా నాకు కథ నచ్చిన తర్వాత నాన్నగారు కూడా వింటారు. అలా ఆయన ఈ కథను విన్నారు. చిన్న చిన్న మార్పులు చెప్పారంతే..అయితే బన్ని సినిమా ఫస్ట్ కాపీ అయ్యే వరకు సినిమా గురించి ఏమీ అడగలేదు. సినిమా చూసి బావుందని మెచ్చుకున్నాడు. ఒక ఎంటర్‌టైనింగ్ మూవీ, నెక్ట్స్ కొత్త కాన్సెప్ట్ మూవీ చేయడానికి ఆసక్తి చూపుతాను. అలా చేస్తే ఆడియెన్స్‌కు కూడా నా సినిమాలు కొత్తగా అనిపిస్తాయి. ప్రస్తుతం రెండు, మూడు కథలు విని..ఓకే చెప్పాను. ప్రస్తుతం అవి డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉన్నాయి`` అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.