close
Choose your channels

మరోసారి బాలయ్య అతిథి పాత్ర చేస్తారా?

Monday, November 16, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మరోసారి బాలయ్య అతిథి పాత్ర చేస్తారా?

నటసింహ నందమూరి బాలకృష్ణ గెస్ట్‌ రోల్స్‌లో నటిస్తారా? అంటే ఎందుకు నటించరని ఆయన అభిమానులు ఎదురు ప్రశ్నిస్తారు. ఎందుకనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంతకు ముందు మంచు మనోజ్‌ హీరోగా నటించిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రంలో బాలకృష్ణ అతిథి పాత్రలో నటించి మెప్పించారు. ఇప్పుడు మరోసారి అలాంటి గెస్ట్‌రోల్‌లో ఆయన అభిమానులను మెప్పించబోతున్నారని సమాచారం. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మేరకు యువ కథానాయకుడు నాగశౌర్యతో సీనియర్‌ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్‌ ఓ సినిమా చేయబోతున్నారు.

ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్‌ రోల్‌ ఉంది. కథను మలుపుతిప్పే ఆ పాత్రలో ఓ సీనియర్‌స్టార్‌ నటిస్తే బావుంటుందని మేకర్స్‌ భావించారు. బాలకృష్ణ ఆదిత్య 369 చిత్రాన్ని నిర్మించింది ఈ నిర్మాతే. అప్పటి నుండి బాలకృష్ణతో ఉన్న పరిచయం కారణంగా శివలెంక కృష్ణ ప్రసాద్‌ ఆయన్ని ఈ పాత్రలో నటింప చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. కథ విని, నచ్చితే బాలకృష్ణ తప్పకుండా ఆరోల్‌ చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక హీరోగా బాలకృష్ణ, బోయపాటి దర్శకత్వంలో మూడో సినిమాను చేస్తున్నారు. సింహా, లెజెండ్‌ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబోలో రూపొందుతోన్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.