రిటర్న్ గిఫ్ట్ సవాల్.. టీడీపీ గెలవకుంటే గుడ్బై చెప్పేస్తా!
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కచ్చితంగా మరోసారి సీఎం దక్కించుకుంటామని అధికారపార్టీ.. గతంలోనే చేజారిందని ఈ సారి సీఎం పీఠం తమదేనని వైసీపీ.. ఎస్.. నేనే కింగ్ మేకర్ను అవుతానని జనసేనాని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో సవాళ్లు, ప్రతి సవాళ్లు.. మాటల యుద్ధం ఓ రేంజ్లో జరుగుతోంది. తాజాగా తెనాలి టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సంచలన ప్రకటన చేశారు. ఈయన ప్రకటన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోస్తా ఆంధ్రాకు వెళ్లి చంద్రబాబును మొదలుకుని స్థానిక నేతల వరకూ అందరిపైనా విమర్శల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు కౌంటర్గా మాట్లాడిన ఆలపాటి.. ఇలా సవాల్ విసిరారు.
తలసానికి స్ట్రాంగ్ కౌంటర్!
"రానున్న ఎన్నికల్లో టీడీపీ తిరిగి అధికారంలోకి రాకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. తలసాని శ్రీనివాస్ ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు. నీతి నిజాయతీలు లేని వ్యక్తులు రాజకీయాలకు పనికిరారు. తలసాని మాట్లాడే మాటల విధానం మార్చుకోవాలి. తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన మాజీ మంత్రులు ఏపీలో మాట్లాడిన మాటలు వింటుంటే వారు ఎన్నికల్లో ఎలా గెలిచారో అర్థం కావట్లేదు" అని తలసానికి ఆలపాటి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
రాజకీయాలకు దూరంగా ఉంటా..!
తెలంగాణ సీఎం కేసీఆర్.. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న విషయం విదితమే. అయితే మీరు ఒకటిస్తే..తాను మూడిస్తానంటూ చంద్రబాబు దిమ్మదిరిగేలా కౌంటరిచ్చారు. ఈ వ్యవహారంపై తాజాగా ఆలపాటి మాట్లాడుతూ.. "రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని మాట్లాడే వారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. టీడీపీ గెలవకపోతే రాజకీయాలకు దూరంగా ఉంటాను" అని ఆలపాటి బహిరంగంగా సవాల్ విసిరారు. అయితే.. ఆలపాటి వ్యాఖ్యలకు తలసాని గానీ లేదా టీఆర్ఎస్ నేతల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.