close
Choose your channels

మహేశ్ సినిమాలో రేణు .... ఖండిస్తుందా..?‌

Tuesday, January 5, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మహేశ్ సినిమాలో రేణు .... ఖండిస్తుందా..?‌

సూపర్‌స్టార్ మ‌హేశ్ చిత్రంలో ప‌వ‌న్ మాజీ స‌తీమ‌ణి రేణు దేశాయ్ న‌టిస్తుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. వివ‌రాల మేర‌కు.. మ‌హేశ్ 27వ చిత్రంగా ప‌రశురాం ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ‘స‌ర్కారువారి పాట‌’ ఈ నెల‌లో షూటింగ్ ప్రారంభం కానుందనే సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో రేణు దేశాయ్ మ‌హేశ్ వ‌దిన పాత్ర‌లో న‌టిస్తుంద‌ని టాక్ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఇంత‌కు ముందు కూడా రేణు దేశాయ్‌.. ‘స‌ర్కారువారి పాట‌’ చిత్రంలో న‌టిస్తుంద‌ని న్యూస్ వ‌చ్చింది. అప్ప‌ట్లో రేణు దేశాయ్ ఆ వార్త‌ల‌ను ఖండించింది. త‌న‌ను ఎవ‌రూ సంప్ర‌దించ‌లేద‌ని చెప్పింది. మ‌రోసారి ఇప్పుడు ఆ వార్తే మ‌ళ్లీ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. మ‌రి ఈసారి మ‌ళ్లీ ఖండిస్తుందేమో చూడాలి. ఒక‌వేళ రేణుదేశాయ్ సైలెంట్‌గా ఉండిపోతే మాత్రం వార్త నిజ‌మ‌నే అనుకుంటారు.

కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న‘స‌ర్కారువారి పాట‌’ చిత్రం మైత్రీ మూవీ మేక‌ర్స్ , 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్స్ నిర్మిస్తున్నాయి. కోవిడ్ ప్రభావం కారణంగా ఇండియాలో చిత్రీకరించాల్సిన సన్నివేశాలను ముందుగా చిత్రీకరిస్తారు. ఏప్రిల్‌లో యుఎస్ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో భారీ సక్సెస్‌ను సొంతం చేసుకున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.