close
Choose your channels

రైతన్నలకు వైఎస్ జగన్ సర్కార్ మరో వరం..

Monday, October 14, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రైతన్నలకు వైఎస్ జగన్ సర్కార్ మరో వరం..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నాలుగు నెలల వ్యవధిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు కీలక, సంచలన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా విద్య, ఉద్యోగాలు, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు జగన్. ఇప్పటికే గ్రామ వాలెంటర్లు.. గ్రామ సచివాలయ పోస్టులతో లక్షలాది మందికి ఉద్యోగ అవకాశం కల్పించిన సీఎం.. తాజాగా వ్యవసాయంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రైతన్నలపై వైఎస్ జగన్ వరాల జల్లు కురిపించారు.

సోమవారం నాడు అగ్రికల్చర్‌ మిషన్‌పై జగన్‌ సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రులు కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, డాక్టర్‌ అనిల్‌కుమార్‌యాదవ్, ఎంవీఎస్‌ నాగిరెడ్డి, పాలగుమ్మి సాయినాథ్, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి అమలుకానున్న ‘రైతు భరోసా’ పథకంపై, ధరల స్థిరీకరణ నిధి, రబీ సాగు కార్యాచరణపై చర్చించారు. ఈ క్రమంలో వైఎస్సార్ రైతు భరోసా పథకంలో కీలక నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే రైతు భరోసా పథకం కింద రైతన్నలకు పెట్టుబడి సాయాన్ని రూ. 12,500 ఇవ్వాలని వైఎస్ జగన్ భావించారు. అయితే సడన్‌గా ఏం జరిగిందో ఏమెగానీ.. మరో వెయ్యి రూపాయిలు కలిపి మొత్తం రూ. 13,500కు పెంచుతున్నట్టు అధికారికంగా జగన్ ప్రకటించారు. అంతేకాదు.. రైతు భరోసా అమలును నాలుగేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచడం జరిగింది. దీంతో ఒక్కో ఏడాదికి రైతు భరోసా కింద 13,500 చొప్పున ఐదేళ్లలో రూ. 67,500 పెట్టుబడి సాయం రైతన్నలకు అందనుంది.

కాగా.. ఈ పెట్టుబడి సాయాన్ని ప్రతి ఏడాది మూడు విడతల్లో అందజేయనుంది జగన్ సర్కార్. కాగా, రైతు భరోసా పథకాన్ని ఈ నెల 15వ తేదీన నెల్లూరు సమీపంలోని కాకుటూరులో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్న విషయం విదితమే. వైఎస్ జగన్ నిర్ణయంతో రాష్ట్రంలో పలువురు రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తూ.. థ్యాంక్యూ సీఎం అని చెబుతున్నారు. మరి ఈ వ్యవహారంపై ప్రతిపక్షాల నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.