టీటీడీ తాత్కాలిక ఈవోగా అదనపు ఈవో ధర్మారెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డిని తాత్కాలికంగా.. ఈవో కార్యకలాపాలు చూడాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా ఉధృతి నేపథ్యంలో టీటీడీ ఈవో జవహర్రెడ్డిని ఇప్పటికే..
స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ చైర్మన్గా ప్రభుత్వం నియమించింది. జవహర్రెడ్డిని తాడేపల్లి నుంచి విధులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో బాధ్యతలను తాత్కాలికంగా అదనపు ఈవో ధర్మారెడ్డికి ప్రభుత్వం అప్పగించింది.
రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలోనే 104 కాల్సెంటర్ను ఏర్పాటు చేసింది. అలాగే స్టేట్ కోవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్గా టీటీడీ ఈవో కేఎస్ జవహర్రెడ్డి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. టీటీడీ ఈవో కేఎస్ జవహర్రెడ్డి హెడ్క్వార్టర్స్ను తాత్కాలికంగా తిరుపతి నుంచి వెలగపూడి సచివాలయానికి మారుస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments