close
Choose your channels

Comedian ali : మూడున్నరేళ్ల నిరీక్షణ, అలీని కరుణించిన జగన్.. ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి

Thursday, October 27, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కమెడియన్ అలీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరుణ చూపారు. ఆయనను ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ పదవిలో అలీ రెండేళ్ల పాటు పదవిలో వుంటారు.

2019 ఎన్నికలకు ముందు వైసీపీలోకి :

కరడుగట్టిన తెలుగుదేశం కార్యకర్తగా ముద్రపడిన అలీ.. 2019 ఎన్నికలకు ముందుకు వైసీపీలో చేరారు. ఆ సమయంలో గుంటూరు వెస్ట్ కానీ, రాష్ట్రంలోని మరేదైనా నియోజకవర్గ టికెట్ లభిస్తుందని అలీ ఆశించారు. కానీ జగన్ నుంచి ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో.. వైసీపీ అభ్యర్ధుల తరపున ముమ్మరంగా ప్రచారం చేశారు. ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించినా అలీకి ఎలాంటి పదవీ దక్కలేదు. దీంతో మూడేళ్ల పాటు ఆయన వెయిట్ చేశారు. అలీకి పదవి దక్కకపోవడానికి అనేక కారణాలు వున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అలీ అత్యంత ఆప్తుడు, అలాగే తెలుగుదేశం పార్టీలోని నేతలందరితోనూ ఆయనకు సత్సంబంధాలు వున్నాయి. ఈ కారణం చేతే జగన్ దృష్టి అలీ మీదకు వెళ్లలేదని విశ్లేషకులు అంటున్నారు.

గుడ్ న్యూస్ చెబుతానని.. మొండిచేయి :

ఇక తన పని తాను చేసుకుంటూ పోతున్న సమయంలో ఈ ఏడాది ఆరంభంలో సీఎం జగన్‌ను అలీ కలిశారు. త్వరలో శుభవార్త వింటారని, సిద్ధంగా వుండాలని జగన్ అన్నారు. దీంతో అంతా అలీకి రాజ్యసభ ఖాయమని భావించారు. కానీ అక్కడా ఈ సొట్టబుగ్గల చిన్నోడికి నిరాశ తప్పలేదు. వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల లిస్ట్‌లో అలీ పేరు వినిపించలేదు. కానీ ఆయన ఎలాంటి స్పందనా చేయలేదు. అయితే మరోసారి వక్ఫ్‌బోర్డ్ ఛైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరిగినా .. దానిని ఖాదర్ భాషాకు ఇచ్చారు. అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేయగా, పార్టీ పదవులు కూడా ఫుల్ అయ్యాయి. ఈ క్రమంలో అలీకి ఈసారి మొండిచేయి తప్పదని అంతా భావిస్తున్న వేళ .. జగన్ అనూహ్యంగా నిర్ణయం తీసుకున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.