close
Choose your channels

ఆడియెన్స్ కు కనెక్ట్ కావడానికి చాలా కష్టపడ్డాను - ఆదాశర్మ

Monday, February 22, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పివిపి నిర్మాణ సంస్థ, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ తో కలిసి నిర్మించిన సస్పెన్స్ డ్రామా క్షణం`. అడవిశేష్, ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో అనసూయ కీలకపాత్రలో నటించింది. ఈ సినిమా ఫిభ్రవరి 26న విడుదల అవుతుంది.

ఈ సందర్భంగా ఆదాశర్మ మాట్లాడుతూ ...

-అనసూయ. తను రియల్లీ టాలెంటెడ్ పర్సన్. ఈ సినిమా విషయానికి వస్తే చాలా కీలకపాత్ర చేసింది. ఈ సినిమాలో నేను, అనసూయ కలిసి యాక్ట్ చేయలేదు.

-'1920' సినిమా తర్వాత అలాంటి కష్టమైన క్యారెక్టర్ చేసిన సినిమా క్షణం`. చాలా టఫ్ క్యారెక్టర్ చేశాను. రెండు షేడ్స్ ఉంటుంది. పాత్ర పరంగా ఆడియెన్స్ కు క్యారెక్టర్ కనెక్ట్ కావడానికి చాలా కష్టపడ్డాను.

-క్షణం` సినిమాలో మదర్ క్యారెక్టర్ చేశానా? లేదా? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. అంటే ఈ నెల 26వరకు వెయిట్ చేయాల్సిందే

- ఏం జరుగుతుందో ఎక్స్ పెక్ట్ చేయని విధంగా సాగే సబ్జెక్ట్. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాదు, డ్యాన్సులు, ఐటెంసాంగ్స్ ఏవీ లేవు.

-డైరెక్టర్ రవికాంత్ ను ఫాలో అయ్యానంతే. లుక్ పరంగా శ్రద్ధ తీసుకున్నాను. కానీ ఎటువంటి రీసెర్చ్ చేయలేదు.

-పివిపి బ్యానర్ ఇలాంటి సినిమాను బ్యాకింగ్ గా నిలవడం మా లక్ అనాలి. ఇలాంటి పెద్ద బ్యానర్ ఈ సినిమాకు బ్యాకింగ్ ఉండబట్టే ఈ సినిమా చేయడానికి కారణమని చెప్పాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.