close
Choose your channels

లీగల్ చిక్కుల్లో అడవి శేష్.. వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు..

Tuesday, December 29, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

లీగల్ చిక్కుల్లో అడవి శేష్.. వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు..

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టి.. హీరోగా తనకంటూ మంచి ఇమేజ్‌ను ఏర్పాటు చేసుకున్న నటుడు అడవి శేష్. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్‌తో తనకంటూ మంచి మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నారు. అడవి శేష్ సినిమాల కోసం యూత్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా ‘మేజర్’. ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అయితే అడవి శేష్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘టు స్టేట్స్’. ఈ చిత్రం ప్రస్తుతం నిలిచిపోయింది. అయితే ఈ సినిమా కారణంగా అడవి శేష్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు.

నిజానికి ‘టు స్టేట్స్’ అనేది బాలీవుడ్ మూవీ. కాగా.. ఈ సినిమా తెలుగులోనూ ఇదే పేరుతో రీమేక్ స్టార్ట్ చేశారు. ఈ రీమేక్‌కు వెంకట్ కుంచం దర్శకత్వం వహించారు. ఎం.ఎల్‌.వి. సత్యనారాయణ సినిమాను నిర్మించడానికి రెడీ అయ్యారు. అయితే సినిమా అవుట్ పుట్ విషయంలో తేడాలు రావడంతో అడవి శేష్ సినిమా నుంచి తప్పుకున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ సినిమా వ్యవహారంపైనే నిర్మాత సత్యనారాయణ కోర్టును ఆశ్రయించారు.

ఈ కేసుపై విచారించిన కోర్టు.. జనవరి 5లోపు అడివి శేష్‌ తన సినిమాకు సంబంధించిన వివరణను ఇవ్వాలంటూ ఆదేశాలను జారీ చేసింది. మరి దీనిపై అడివిశేష్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి. నిర్మాత, దర్శకుడితో సినిమా విషయమై వచ్చిన విభేదాలను ఓ కొలిక్కి తీసుకొచ్చి అదే సినిమాను కంటిన్యూ చేస్తారా? లేదంటే వేరే ఏదైనా సినిమాను ప్లాన్ చేసి కొత్త సినిమాకు డేట్స్‌ను ఇస్తారా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.