మరోసారి ‘చోటా’ హాట్ టాపిక్.. నిన్న కాజల్.. నేడు తమన్నా!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ టాప్ సినిమాటోగ్రాఫర్లలో ‘చోటా కె నాయుడు’ ఒకరన్న విషయం తెలిసిందే. అతి తక్కువ కాలంలో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కెమెరా వర్క్కి ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్స్, ప్రొడ్యూసర్సే అభిమానులు ఉన్నారు. అంతేకాదు.. వయసు ఎంత పెరుగుతున్నా ఎప్పుడూ ఉత్సాహంగానే కనిపిస్తుంటారు. ఇదే ఉత్సాహంతో అప్పుడప్పుడు కొన్ని కొన్ని చిలిపి చేష్టలతో వార్తల్లో సైతం నిలుస్తుంటారు.
గతంలో కాజల్..!
గతంలో ‘కవచం’ సినిమా టీజర్ లాంచ్ సందర్భంగా.. హీరోయిన్ కాజల్ అగర్వాల్ నచ్చిందంటూ బహిరంగంగా ముద్దిచ్చేశారు. ఆ హఠాత్ సంఘటనతో కాజల్ ఒకింత నివ్వెరబోయింది. ఏం చేయాలో దిక్కుతోచక నవ్వేసి ఊరుకుంది. అది కూడా ప్రసంగంలో ఈ వ్యవహారం జరగడంతో సోషల్ మీడియాలో పెద్ద హంగామానే జరిగింది. అయితే చోటా మాత్రం దీనిని సరదాగానే భావించారు. అయితే తాజాగా మరోసారి చోటా హాట్ టాపిక్ అయ్యారు. ఈసారి మిల్క్ బ్యూటీ తమన్నా వ్యవహారంలో సోషల్ మీడియా వేదికగా చర్చల్లో నిలిచారు.
ఇప్పుడు తమన్నా..!
తాజాగా.. తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ‘రాజుగారి గది-03’ సినిమా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి తమన్నా.. చోటా కె నాయుడు కూడా హాజరయ్యారు. అయితే ఇక్కడ కూడా తమన్నాను ఆప్యాయంగా చేతిని తన చేతిలోకి తీసుకున్ని షాకిచ్చారు!. ఈ షాక్తో కంగుతిన్న మిల్క్ బ్యూటీ ఏమీ మాట్లాడలేక మిన్నకుండిపోయింది.! అయితే చోటా మాత్రం ప్రేమతో పట్టుకున్నారని అనుకున్నారేమో.. నెట్టింట్లో మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం తమన్నా-చోటా చేయిపట్టుకున్న ఫొటో నెట్టింట్లో చర్చనీయాంశమైంది. సో.. చోటా కే నాయుడు ఏం ఊహించి ఇలా చేస్తున్నారేమో గానీ ప్రతీసారి చర్చనీయాంశమై నలుగురి నోళ్లలో నానుతున్నారు. ఈ అలవాటు మార్చుకుంటే బాగుంటుందని విశ్లేషకులు, క్రిటిక్స్ విమర్శలు సలహాలిస్తున్నారు. సో..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.