close
Choose your channels

Naga Chaitanya:పరశురామ్‌తో వివాదం .. అతని గురించి మాట్లాడటం 'టైమ్ వేస్ట్' , నాగచైతన్య హాట్ కామెంట్స్

Sunday, May 7, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అక్కినేని నాగచైతన్య.. ఏఎన్ఆర్ వంశం నుంచి తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టిన మూడో తరం హీరో. తండ్రి, తాతల నుంచి నట వారసత్వం పుణికిపుచ్చుకున్న చైతూ వారిద్దరి బాటలోనే లవ్, రోమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌లో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. కలిసొచ్చిన జోనర్స్‌లో సినిమాలు చేస్తూ.. మాస్ ఇమేజ్ కోసం కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమను శాసించే కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, పుట్టుకతోనే అపర కుబేరుడైనప్పటికీ చైతూ కొంచెం కూడా గర్వం చూపించరు. తానోక పెద్ద హీరో కొడుకుననే ఫీలింగ్ చూపించకుండా.. సెట్‌లో తన పని తాను చేసుకుపోతారు. అలాగే ఇన్నేళ్ల కెరీర్‌లో ఎప్పుడూ ఏ ఒక్కరి గురించి కూడా ఆయన నెగిటివ్‌గా మాట్లాడింది లేదు. అందుకే నాగచైతన్యను అంతా ఇష్టపడతారని ఫిలింనగర్‌లో వినిపించే మాట.

అతని గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్ :

అలాంటి వ్యక్తి ఓ డైరెక్టర్‌‌పై హాట్ కామెంట్ చేశాడు. ఆయన ఎవరో కాదు పరశురామ్. అతని గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్ అంటూ చైతూ వ్యాఖ్యానించారు. కాగా.. నాగచైతన్య ప్రస్తుతం కస్టడీ సినిమాలో నటిస్తున్నారు. మే 12న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ నేప్యంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది. దీనిలో భాగంగా నాగచైతన్య ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పరశురామ్‌తో అసలు గొడవేంటి అంటూ యాంకర్ ప్రశ్నిస్తాడు. దీనికి చైతూ కాస్త సీరియస్‌గానే రియాక్ట్ అయ్యారు. అసలు అతని గురించి మాట్లాడటమే వేస్ట్ అని కామెంట్ చేశారు. రీజన్ చెప్పడానికి ఏం లేదు.. అంతా టైమ్ వేస్ట్ అని ఆయన ఒక్క ముక్కలో చెప్పేశాడు.

అసలేం జరిగిందంటే :

14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లో నాగచైతన్య, పరశురామ్ కాంబినేషన్‌లో సినిమా పట్టాలెక్కింది. దీనికి నాగేశ్వరరావు అనే టైటిల్ కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. NC 20 అనే వర్కింగ్ టైటిల్‌తో పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా జరిగాయి. కానీ ఈ లోపు అనుకోకుండా సూపర్‌స్టార్ మహేశ్ బాబు నుంచి పరశురామ్‌కి పిలుపొచ్చింది. అంతే చైతూను అతను పక్కనపెట్టి.. సర్కారు వారి పాటను వేగంగా కంప్లీట్ చేశాడు. కానీ చైతూతోనే తర్వాతి సినిమా చేస్తానని పరశురామ్ చెబుతూ వచ్చాడు. దీనిపై నాగచైతన్యను మీడియా ప్రశ్నించగా.. ఇంకా పరశురామ్ ఫుల్ స్క్రిప్ట్ నెరేషన్ ఇవ్వలేదని.. అంతా సెట్ అయ్యాక విషయం చెబుతానని పేర్కొన్నాడు.

తీరా పరశురాం.. చైతూతో చేయ్యాల్సిన కథను విజయ్ దేవరకొండ వద్దకు తీసుకెళ్లినట్లు ఫిలింనగర్‌లో గాసిప్స్ గుప్పుమన్నాయి. దీనికి దిల్‌రాజు నిర్మాత అని ప్రచారం జరిగింది. ఏది ఏమైనా కథ ఒకే అనిపించుకుని, చాలా రోజులు ట్రావెల్ చేసిన తర్వాత .. సూపర్‌స్టార్ నుంచి ఆఫర్ రావడంతో తనను పక్కనపెట్టడంతో చైతూ బాగా హర్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే పరశురామ్‌పై ఆయనకు పీకలదాకా కోపం వున్నట్లుగా ఆయన మాటలను బట్టి చెప్పొచ్చు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.