close
Choose your channels

వీడియో చూసి ఎమోష‌న‌ల్ ట్వీట్ చేసిన బ‌న్నీ..

Tuesday, February 11, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వీడియో చూసి ఎమోష‌న‌ల్ ట్వీట్ చేసిన బ‌న్నీ..

ఈ సంక్రాంతికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టించిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా భారీ విజ‌యాన్ని సాధించింది. సినిమా కంటే ముందే త‌మ‌న్ సంగీతం అందించిన ఈ సినిమా పాట‌లు సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా `సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌...`, `రాములో రాములా ...` పాటలు సినిమా విడుద‌ల‌కు ముందు సెన్సేష‌న్ క్రియేట్ చేస్తే సినిమా రిలీజ్ త‌ర్వాత బుట్ట‌బొమ్మ సాంగ్ పెద్ద సెన్సేష‌న్ అయ్యింది. ఎంత‌లా అంటే బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి స‌హా ప్ర‌తి ఒక్క‌రూ ఈ పాట‌కు టిక్ టాక్ వీడియోలు చేసేంత‌గా.

తాజాగా ఇద్ద‌రు దివ్యాంగులు ఈ పాట‌కు డాన్స్ చేశారు. కాళ్లు లేని యువ‌కుడు.. చేతులు లేని అమ్మాయి చేసిన డాన్స్ వీడియోను టిక్ టాక్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో అటు ఇటు చేరి బ‌న్నీ చెంత‌కు చేరింది. వీడియో చూసిన బ‌న్నీ ఎమోష‌న్ అయ్యారు. ఆ వీడియోను త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ ``ఈ బుట్ట‌బొమ్మ వీడియో నా మ‌న‌సుని తాకింది. సంగీతం మ‌న వైక‌ల్యాన్ని జ‌యిస్తుంది. వీడియో చూసి సంతోషించాను. ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది`` అంటూ మెసేజ్ కూడా పోస్ట్ చేసి త‌న అభిమానుల‌తో విష‌యాన్ని పంచుక‌న్నారు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

అల్లుఅర్జున్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో అల్లు అర‌వింద్‌, ఎస్‌.రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం రూ.200 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.