close
Choose your channels

అంకిత నాపై నిర్మాతకు ఫిర్యాదు చేసింది: నవదీప్

Thursday, November 5, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అంకిత నాపై నిర్మాతకు ఫిర్యాదు చేసింది: నవదీప్

‘జై’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. హీరో పాత్రలే కాకుండా అందివచ్చిన అవకాశాన్ని పట్టుకుంటూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవదీప్. ‘చందమామ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా బుల్లితెరపై కూడా రాణిస్తున్నాడు. కాగా.. అప్పట్లో నవదీప్‌కి హీరోయిన్ అంకితతో గొడవలున్నాయంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఓ షోలో నవదీప్ స్పందించాడు. వారిద్దరి మధ్య అసలేం జరిగిందో వెల్లడించాడు.

అంకితతో సినిమా చేసే నాటికి ఆమె రెండు హిట్లు కొట్టిన హీరోయిన్ అని.. తనేమో ఫ్లాప్ సినిమా హీరోనని నవదీప్ చెప్పాడు. దీంతో తను డేట్లు మార్చి ఇవ్వడమే కాకుండా తమ కోసమే డేట్లు అడ్జెస్ట్ చేస్తున్నాననే ఫీలింగ్‌లో ఉండేదని నవదీప్ వెల్లడించాడు. సినిమాలో చివరి రెండు సాంగ్స్ షూటింగ్ చేయాల్సి ఉందని ఆ సమయంలో అంకితను రావాలని పిలిస్తే రానని చెప్పిందని నవదీప్ తెలిపాడు. దీంతో అగ్రిమెంట్ చూపించి ఆమెను చిత్రబృందం రప్పించాల్సి వచ్చిందన్నారు. నిర్మాతపై గొడవ కావడంతో ఆ కోపాన్ని తనపై కూడా చూపించిందని వెల్లడించాడు.

తను జోకులు చేస్తున్నానంటూ అంకిత.. నిర్మాతకు ఫిర్యాదు చేసిందన్నాడు. తద్వారా షూటింగ్‌ను ఆపేయాలని ప్లాన్ చేసిందని నవదీప్ వెల్లడించాడు. తర్వాత తామిద్దరం కూర్చొని మాట్లాడుకుని మ్యాటర్ సెటిల్ చేసుకున్నామని వెల్లడించాడు. అంతా హ్యాపీ అనుకున్న సమయంలో ఒక రిపోర్టర్ ఫోన్ చేసి మీతో గొడవల కారణంగానే అంకిత నిద్ర మాత్రలు మింగిందట కదా అని ప్రశ్నించడంతో షాక్ అయ్యానని నవదీప్ వెల్లడించాడు. తాను కూడా షాకయ్యానని.. ఆ వార్తలు విని.. తమ ఇంట్లో వాళ్లు కంగారు పడ్డారన్నారు. తరువాత ప్రెస్ మీట్ పెట్టి నిజం చెప్పానని.. ఈ విషయంలో తనకు నాగబాబు బాగా సాయం చేశారని నవదీప్ వెల్లడించాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.