close
Choose your channels

మ‌రో ప్లాప్ డైరెక్ట‌ర్‌తో అనుష్క‌!!

Saturday, March 14, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌రో ప్లాప్ డైరెక్ట‌ర్‌తో అనుష్క‌!!

సూప‌ర్ సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన అనుష్క శెట్టి .. అరుంధ‌తి, బాహుబ‌లి, రుద్ర‌మ‌దేవి, భాగ‌మ‌తి చిత్రాల‌తో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇప్పుడు నిశ్శ‌బ్దం చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుద‌లైన త‌ర్వాత అనుష్క మ‌రో లేడీ ఒరియెంటెడ్ చిత్రంలో న‌టించ‌డానికి ఓకే చెప్పిన‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఆ ద‌ర్శ‌కుడెవ‌రో కాదు.. మ‌హేశ్‌. ఈ ద‌ర్శ‌కుడెవ‌రా? అని ఆలోచించ‌కండి. ఎందుకంటే ఈయ‌న ఆరేళ్ల క్రితం సందీప్ కిష‌న్‌తో రా రా కృష్ణ‌య్య సినిమాను తెర‌కెక్కించాడు. ఆ సినిమాలో సందీప్ కిష‌న్‌, రెజీనాల‌తో పాటు జ‌గ‌ప‌తిబాబు, క‌ల్యాణి కూడా న‌టించారు. సినిమా పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. త‌ర్వాత ఈ ద‌ర్శ‌కుడికి అవ‌కాశాలు లేకుండా పోయాయి.

తాజా సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ద‌ర్శ‌కుడు మ‌హేశ్‌ రీసెంట్‌గా అనుష్క‌ను క‌లిసి ఓ క‌థ చెప్పాడ‌ట‌. అనుష్కకి బాగా న‌చ్చింద‌ట‌. నిశ్శ‌బ్దం సినిమా విడుద‌లైన త‌ర్వాత ఈ ద‌ర్శ‌కుడితో ప‌నిచేస్తాన‌ని చెప్పింద‌ట‌. అనుష్క తాజా చిత్రం నిశ్శ‌బ్దం ఏప్రిల్ 2న విడుద‌ల కావాల్సి ఉంది. అయితే క‌రోనా వైర‌స్ కార‌ణంగా సినిమా థియేట‌ర్స్‌, మాల్స్ అన్నీ మూత ప‌డ్డాయి. మ‌రి ఈ క‌రోనా ఎఫెక్ట్ ఈ నెల 31తో ముగుస్తుందా? లేక కంటిన్యూ అవుతుందా? అని తెలియ‌డం లేదు. ఇప్ప‌టికే ఉగాదికి విడుద‌ల కావాల్సిన సినిమాల‌న్నీ పోస్ట్ పోన్ అయిన‌ట్లే.. మ‌రి ఆ సినిమాల‌న్నీ ఏప్రిల్‌లో వ‌స్తే.. మ‌రి ఏప్రిల్ 2న రావాల్సిన నిశ్శ‌బ్దం, అర‌ణ్య చిత్రాలు ఎప్పుడు వ‌స్తాయో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.