close
Choose your channels

ఫలించిన రాజమౌళీ ప్రయత్నాలు.. ‘‘ఆర్ఆర్ఆర్’’ టికెట్ రేట్ల పెంపుకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

Thursday, March 17, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోన్న సినిమా ‘‘ఆర్ఆర్ఆర్’’. బాహుబలి సిరీస్ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలున్నాయి. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా, తదితర కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. అన్ని విఘ్నాలను దాటుకుని మార్చి 25న ఆర్ఆర్ఆర్‌ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్‌కు ఏపీ సర్కార్ బంపరాఫర్ ప్రకటించింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఇటీవల దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య సోమవారం ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఏపీ ముఖ్యమంత్రితో టికెట్ ధరల విషయమై చర్చించారు. ఈ క్రమంలో రాజమౌళి ప్రయత్నాలు ఫలించాయి. దీంతో ప్రభుత్వం “ఆర్‌ఆర్‌ఆర్‌” టిక్కెట్‌ ధరలను 100 రూపాయల వరకు పెంపునకు అనుమతించింది. తద్వారా టికెట్ రేట్ల విషయంలో బెనిఫిట్ అందుకుంటున్న మొదటి తెలుగు సినిమాగా “RRR” నిలిచింది. ఇక బెనిఫిట్ షోలకు కూడా ఏపీలో మద్ధతు లభించింది. ఎగ్జిబిటర్లు పెద్ద సినిమాలను రోజుకు ఐదు షోలు ప్రదర్శించవచ్చని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. పెద్ద సినిమా, చిన్న సినిమా ఒకేరోజు విడుదలైతే ఎగ్జిబిటర్లు కనీసం రోజుకు ఒక్కసారైనా చిన్న సినిమాలను ప్రదర్శించాలని మంత్రి సూచించారు.

ఇకపోతే.. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్‌.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఓలివియా మోరిస్‌ కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.