రాధికా శరత్కుమార్ ను అరెస్ట్ చేయండి
Send us your feedback to audioarticles@vaarta.com
రాధికా శరత్కుమార్ను అరెస్ట్ చేయాలని చెన్నై సైదాపేట కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఓ చెక్కు బౌన్స్ కేసులో వారిరువురి మీద కేసు రిజిస్టర్ అయింది. పలుమార్లు ఉత్తర్వులు జారీ చేసినా కోర్టుకు వారిద్దరు హాజరు కాకపోవడంతో ఆగ్రహం చెందిన కోర్టు ఇప్పుడు వారిని అరెస్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
వివరాల్లోకెళ్తే, మలయాళ నిర్మాత లిస్టిన్ స్టీఫెన్తో కలిసి రాధికా, శరత్కుమార్ పలు సినిమాలను నిర్మించారు. మేజిక్ ఫ్రేమ్స్ బ్యానర్ మీద వాళ్లు నిర్మించిన `చెన్నైయిల్ ఒరు నాళ్`, `మారి` వంటివన్నీ ఆ తరహా చిత్రాలే. ఈ సినిమాల కోసం రేడియన్స్ మీడియా దగ్గర నిర్మాతలు రూ.2కోట్లు అప్పు తీసుకున్నారు. ఈ రుణాన్ని తీర్చడం కోసం రాధికా శరత్కుమార్ చెక్కు ఇచ్చారు. అయితే అది బౌన్స్ అయింది. దాంతో రాధికా, శరత్కుమార్ మీద రేడియన్స్ మీడియా హౌస్ కేసు ఫైల్ చేసింది. దీనికి సంబంధించి పలు హియరింగ్లకు హాజరు కావాలని దంపతులకు నోటీసులు అందాయి. కానీ వాళ్లు దాన్ని పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహం చెందిన కోర్టు హియరింగ్ను ఈనెల 12కు పోస్ట్ పోన్ చేసి దంపతులను అరెస్ట్ చేయాలని పోలీసులకు సూచించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.