close
Choose your channels

బాల‌య్య నిర్మాత‌గా.. బోయ‌పాటి చిత్రం?

Thursday, January 18, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

న‌ట‌సింహ‌ నంద‌మూరి బాల‌కృష్ణ‌, స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో సినిమా వ‌స్తుందంటే.. బాక్సాఫీస్‌కి కొత్త ఊపు వ‌స్తుంది. సింహా, లెజెండ్.. ఇలా ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన రెండు సినిమాలు కూడా కాసుల గ‌ల‌గ‌ల‌లు వినిపించాయి. ముచ్చ‌ట‌గా మూడోసారి ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా రాబోతుందంటూ గ‌త‌ కొంత‌కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమాకి బాల‌కృష్ణ‌నే నిర్మాణ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్ట‌నున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ప్ర‌స్తుతం జై సింహా విజ‌యానందంలో ఉన్న బాల‌య్య‌.. అతి త్వ‌ర‌లో ఎన్టీఆర్ బ‌యోపిక్‌ని ప‌ట్టాలెక్కించ‌నున్నారు. తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ సినిమా హిందీలోనూ విడుద‌ల కానుంది.

ఈ సినిమాకి బాల‌య్యే నిర్మాత‌గా వ్య‌వ‌హరించ‌నున్నారు. ఆ సినిమాతో పాటు ఇప్పుడు బోయ‌పాటి సినిమాకి కూడా బాల‌కృష్ణ నిర్మాణ బాధ్య‌త‌ల‌ను చేపట్టనుండ‌డం వార్త‌ల్లో నిలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై క్లారిటీ రావ‌చ్చు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.