close
Choose your channels

చిత్ర సీమలో మళ్లీ ‘‘కరోనా’’ టెన్షన్...  విక్రమ్‌కు కోవిడ్ పాజిటివ్

Friday, December 17, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చిత్ర సీమలో మళ్లీ ‘‘కరోనా’’ టెన్షన్...  విక్రమ్‌కు కోవిడ్ పాజిటివ్

భారత్‌లో కరోనా వైరస్ ఎంతోమంది ప్రముఖులను బలి తీసుకుంది. వీరిలో సినీతారలు కూడా వున్నారు. దేశంలో కోవిడ్ ఫస్ట్, సెకండ్ వేవ్ సమయాల్లో పలువురు సినీనటులు, టెక్నీషియన్లు వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు చావు అంచులదాకా వెళ్లొచ్చారు. అయితే ఇటీవల మళ్లీ సినీ పరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. మొన్నటికి మొన్న బాలీవుడ్ హీరోయిన్లు కరీనా కపూర్, అమృతా అరోరా సహా పలువురు కోవిడ్ బారినపడ్డారు. ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఇచ్చిన పార్టీకి హాజరైన తర్వాతి నుంచి వీరిలో కరోనా లక్షణాలు కనిపించాయి. అయినప్పటికీ వీరిద్దరూ పలు పార్టీలు, ఫంక్షన్లకు హాజరవ్వడంతో ముంబై నగరపాలక సంస్థ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంటాక్ట్ ట్రేసింగ్‌ నిర్వహిస్తున్నారు.

ఇటు తమిళ చిత్ర సీమలో కూడా పలువురు కోవిడ్ బారినపడ్డారు. ఇటీవల విలక్షణ నటుడు కమల్ హాసన్ అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. పరీక్షలు చేయించగా కరోనాగా తేలింది. ఆ తర్వాత ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుని , కోలుకున్నారు. తాజాగా మరో విలక్షణ నటుడు విక్రమ్ కూడా కరోనా బారినపడ్డారు. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న విక్రమ్ కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది.

ప్రస్తుతం విక్రమ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన వ్యక్తిగత సిబ్బంది తెలియజేశారు. అయితే విక్రమ్‌కి సోకింది సాధారణ కరోనానా లేదా ఒమిక్రాన్ వేరియంటా? అని నిర్ధారించడానికి ఆయన శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపినట్లుగా తెలుస్తోంది. విక్రమ్‌ కోవిడ్ బారినపడిన విషయం తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.